తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu In Dubai: దుబాయ్‌లో మహేష్ బాబు.. తదుపరి చిత్రంపై ఫోకస్

Mahesh Babu in Dubai: దుబాయ్‌లో మహేష్ బాబు.. తదుపరి చిత్రంపై ఫోకస్

06 December 2022, 6:38 IST

    • Mahesh Babu in Dubai: సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. త్రివిక్రమ్ కాంబోలో నటిస్తున్న SSMB28 ప్రాజెక్టుకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు
మహేష్ బాబు

మహేష్ బాబు

Mahesh Babu in Dubai: సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది అస్సలు కలిసిరాలేదనేది వాస్తవం. ఒకే సంవత్సరంలో తనకిష్టమైన ముగ్గురును కోల్పోవడం ఆయనకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఏడాది మొదట్లో సోదరుడు రమేష్ బాబు, సెప్టెంబరులో తల్లి ఇందిరా దేవి, గత నెలలో తండ్రి కృష్ణ ఇలా అందరూ స్వల్ప వ్యవధిలోనే కన్నుమూశారు. దీంతో షూటింగులకు కూడా కాస్త గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. తల్లి మృతి తర్వాత ఆ బాధ నుంచి కోలుకోడానికి స్విట్జర్లాండ్ వెళ్లిన మహేష్.. తాజాగా మరోసారి విదేశాలకు పయనమయ్యారు. ఈ సారి వ్యక్తిగత వెకేషన్ కోసం కాకుండా సినిమా చర్చల్లో భాగంగా దుబాయ్‌కు చేరుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

తండ్రి మరణం తర్వాత గత వారమే త్రివిక్రమ్‌తో చేయనున్న SSMB28 ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైన సూపర్‌స్టార్.. తాజాగా తన టీమ్‌తో దుబాయ్‌లో సిట్టింగ్ వేశారు. దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి కాగా.. త్వరలో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన దుబాయ్‌లో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓ వారం రోజుల పాటు అక్కడే ఉండి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాలుపంచుకోనున్నారట.

ఈ నెల చివరన లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది.

ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం