తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu | లవ్ ట్రాక్ కు రిపీటెడ్ ఆడియెన్స్‌ ఉంటారు- మహేష్ బాబు

Mahesh Babu | లవ్ ట్రాక్ కు రిపీటెడ్ ఆడియెన్స్‌ ఉంటారు- మహేష్ బాబు

HT Telugu Desk HT Telugu

08 May 2022, 6:47 IST

  • సర్కారువారి పాట సినిమాలో హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ హైలైట్ గా నిలుస్తుందని అన్నారు మహేష్ బాబు. సినిమాలో తన క్యారెక్టర్, లుక్, బాడీలాంగ్వేజ్ కొత్తగా ఉంటాయని అన్నారు. 

మహేష్ బాబు
మహేష్ బాబు (twitter)

మహేష్ బాబు

సర్కారువారి పాటలో కొన్ని సీన్స్ లో నటిస్తున్నప్పుడు పోకిరి నాటి రోజులు గుర్తొచ్చాయని అన్నారు మహేష్ బాబు. శనివారం హైదరాబాద్ లో సర్కారువారి పాట ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.  ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ సినిమాలో తన క్యారెక్టర్ ను దర్శకుడు పరశురామ్ కొత్తగా డిజైన్ చేశాడని చెప్పారు.  

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

‘నా ఫేవరేట్ క్యారెక్టర్స్ లో ఇది ఒకటి. నా లుక్, మేనరిజమ్స్, బాడీలాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా కోసం పనిచేశా.  కొన్ని సీన్స్ లో నటిస్తున్నప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయి. సర్కారు వారి పాట సినిమాకు హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ హైలైట్ గా నిలుస్తుంది. తప్పకుండా ఈ ట్రాక్ కు రిపీటెడ్ ఆడియెన్స్‌ ఉంటారు. నా మాటగా రాసుకొండి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు నేను పెద్ద ఫ్యాన్ ను. ఈ సినిమాలో బీజీఎమ్ ఇరగదీశాడు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. 

నాకు బాగా దగ్గరైనవాళ్లు దూరమయ్యారు. కానీ ప్రేక్షకుల అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలా ధైర్యంగా ముందుకు సాగడానికి. ఈ నెల 12న అందరికి నచ్చబోయే సినిమా వస్తుంది. థియేటర్లలో అందరికి పండుగ అవుతుంది  ఫ్యాన్స్ అందరూ గర్వపడే మంచి సినిమా అవుతుంది’ చెప్పారు. కొరటాల శివ సహకారంతో మహేష్ బాబు  కలిసి ఈ వినిపించగలిగానని పరశురామ్ అన్నారు. మహేష్ బాబులోని మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారని వేడుకగా అతిథిగా హాజరైన దర్శకుడు సుకుమార్ చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తిసురేష్ కథానాయికగా నటించింది. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం