Santhoshan Awards: సంతోషం అవార్డ్స్ వేడుకలో కన్నడ నటులకు అవమానం - ఫైర్ అవుతోన్న నెటిజన్లు
04 December 2023, 10:28 IST
Santosham Awards: గోవాలో జరుగుతోన్న సంతోషం అవార్డుల వేడుకలో కన్నడ నటీనటులకు అవమానం జరిగిందంటూ కన్నడ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అవార్డుల వేడుకల నుంచి కన్నడ నటీనటులను అర్ధాంతరంగా వెళ్లగొట్టారని ట్వీట్ చేసింది.
సంతోషం అవార్డుల వేడుక
Santosham Awards: గోవాలో జరుగుతోన్న సంతోషం అవార్డుల వేడుకలో కన్నడ నటులకు అవమానం జరిగింది. కన్నడ నటులకు అవార్డులు ఇస్తోన్న సమయంలో సడెన్గా లైట్స్ ఆపేశారని, కన్నడ యాక్టర్స్ను వేదిక నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పి అవమానించారని శారద అనే కన్నడ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సంతోషం అవార్డులకు హాజరుకావడానికి గోవా వచ్చిన రమేష్ అరవింద్, సప్తమిగౌడ, రాగిణి ద్వివేదితో పాటు పలువురు కన్నడ నటీనటులు స్టే చేసిన హోటల్ బిల్లులను నిర్వహకులు చెల్లించలేదని శారద తన ట్వీట్లో పేర్కొన్నది.హోటల్ యాజమాన్యం రూమ్లను లాక్ చేయడంతో నటీనటులందరూ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, చివరకు పోలీజుల జోక్యంతో హోటల్ నుంచి వారంతా బయటపడగలిగారని శారద తెలిపింది.
కన్నడ నటీనటులను కావాలనే ఈ అవార్డుల వేడుకలో అవమానించారంటూ శారద తన ట్వీట్లో పేర్కొన్నది. ఈ జర్నలిస్ట్ ట్వీట్ వైరల్గా మారింది. పలువురు కన్నడ ఫ్యాన్స్ సంతోషం నిర్వహకులపై ఫైర్ అవుతోన్నారు. కన్నడ నటీనటులకు జరిగిన అవమానంపై ఇండస్ట్రీ మొత్తం ఖండించాలని, ఇలాంటి వేడుకలను బాయ్ కట్ చేయాలని పిలుపునిస్తోన్నారు.
టాపిక్