Tollywood News: జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ హీరోగా ‘పీప్ షో’ చిత్రం.. టీజర్ విడుదల
14 July 2022, 14:57 IST
- జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ హీరోగారూపొందుతోన్న చిత్రం పీప్ షో. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. మలయాళ సంగీత దర్శకుడు రంజిత్ రాజ్ మ్యూజిక్ సమకూర్చాడు. నేహా దేశ్ పాండే హీరోయిన్గా చేస్తోంది.
ఆటో రాంప్రసాద్ హీరోగా పీప్ షో
క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం "పీప్ షో". దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్.కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి "పీప్ షో" చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్. ఈ సినిమా.. దర్శకుడిగా క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
శ్రీరాగ్, సంధ్య తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫర్గా ఈశ్వర్ పనిచేస్తుండగా.. ఎడిటర్గా సునీల్ మహారాణ చేస్తున్నారు. సంగీతం రంజిన్ రాజ్ సమకూరుస్తున్నారు. టీవీఎన్ రాజేశ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.కుమార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
టాపిక్