తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas And Prashanth Neel Movie: ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో మరో మూవీ.. ఎప్పుడంటే?

Prabhas and Prashanth Neel Movie: ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో మరో మూవీ.. ఎప్పుడంటే?

13 April 2023, 8:43 IST

    • Prabhas and Prashanth Neel Movie: ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఇప్పటికే సలార్ తెరకెక్కుతోంది. తాజాగా వీరి కాంబో మళ్లీ రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ విషయాన్ని తెలియజేశారు.
ప్రభాస్-ప్రశాంత్ నీల్
ప్రభాస్-ప్రశాంత్ నీల్ (Twitter)

ప్రభాస్-ప్రశాంత్ నీల్

Prabhas and Prashanth Neel Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఇప్పటికే సలార్ తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా చేసింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అదిరిపోయే శుభవార్త చెప్పారు. సలార్ తర్వాత ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి మరో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ఈ విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ.. "త్వరలోనే ప్రభాస్, ప్రసాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ పౌరాణిక సినిమా రానుంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ సలార్‌తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీయనున్నారు. ఇవన్నీ పూర్తయ్యాక ప్రభాస్ సినిమా మొదలవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో ఉంది." అని చెప్పారు.

సలార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందని తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సలార్ టీజర్‌కు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ టీజర్ జూన్‌లో రానున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వర్క్ అంతా పూర్తయిందని అంటున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. హోంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. పాన్ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల చేయనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం