NTR Bollywood Entry: వార్-2లో మొదట ప్రభాస్, విజయ్ను అనుకున్నారా? మరి తారక్ ఎందుకు ఓకే చెప్పారు?
NTR Bollywood Entry: వార్-2లో తొలుత ప్రభాస్, విజయ్ దేవరకొండను అనుకున్నారని కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. హృతిక్కు విలన్లుగా వీరిని తీసుకోవాలని భావించారట. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా వార్-2లో తారక్నే తీసుకోవాలని రాసేటప్పుడే అనుకున్నారట.
NTR Bollywood Entry: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా అంటేనే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తన ఆల్ రౌండర్ ప్రతిభతో ఆడియెన్స్ను కట్టిపడేస్తుంటారు. దీంతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ అనగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్-2లో నటించనున్నట్లు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఈ స్పై ఫ్రాంఛైజీలో తారక్ భాగం కావడం, అందులోనూ హృతిక్కు విలన్గా రానుండటం అభిమానులను ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. అయితే వార్-2లో తారక్ పాత్రకు తొలుత ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించారని, అయితే వాళ్లు వద్దనడంతో ఈ ఎన్టీఆర్ వద్దకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.
అయితే యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ అధినేత, ఈ ఫ్రాంఛైజీ నిర్మాత ఆదిత్య చోప్రా మాత్రం.. తన మైండ్లో మొదటి ఈ ఆఫర్ను ఎన్టీఆర్నే అనుకున్నారని బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం. తారక్ను ఊహించుకునే ఈ పాత్రను రాశారట. ఇద్దరు సూపర్ స్టార్లయిన హృతిక్, ఎన్టీఆర్ మధ్య పోరాటమే వార్-2 ప్రధానాంశమని తెలుస్తోంది. ఇందుకోసం తారక్ను ఈ మూవీ టీమ్ 5 నెలల నుంచే సంప్రదింపులు జరుపుతుందోట. చివరకు ఈ పాత్ర స్క్రిప్టు మార్చిలో పూర్తవడంతో ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుందట.
ఒక వేళ ఎన్టీఆర్ వార్-2లో ఈ రోల్కు ఓకే చెప్పనట్లయితే ఆ పాత్రలో మార్పులు చేర్పులు చేసి బాలీవుడ్ నుంచి మరొకరిని తీసుకోవాలని ముందు మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ తారక్ ఓకే అనడంతో ఈ ప్రాజెక్ట్ యథాతథంగా కొనసాగుతుందట. నవంబరు 2023 నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తుంది.
కాబట్టి ప్రభాస్, విజయ్ను సంప్రదించారనేది అవాస్తవం. ఎన్టీఆర్కే ఈ రోల్ను ముందు ఆఫర్ చేశారని తెలుస్తోంది. వార్ మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇంతకుముందు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ లాంటి సినిమాలు ఈ స్పై ఫ్రాంఛైజీలో వచ్చాయి. టైగర్-3 2023 దీపావళికి విడుదల కానుంది. దీని తర్వాత వార్-2 పట్టాలెక్కనుంది. హృతిక్ రోషన్ హీరోగా నటించనున్న ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.