తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tees Maar Khan In Prime Video: ఓటీటీలో ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్.. ఎందులో ఉందంటే?

Tees Maar Khan in Prime Video: ఓటీటీలో ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్.. ఎందులో ఉందంటే?

17 September 2022, 14:55 IST

    • Tees Maar Khan OTT Release Date: ఆది సాయికుమార్ నటించిన తీస్ మార్ ఖాన్ ఓటీటీలో సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
తీస్ మార్ ఖాన్
తీస్ మార్ ఖాన్ (Twitter)

తీస్ మార్ ఖాన్

Tees Maar Khan on Prime Video: ఆది సాయికుమార్ హీరోగా రూపొందిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. పాయల్ రాజ్‌పుత్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. సునీల్, పూర్ణ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కల్యాణ్ జీ గోగణ దర్శకత్వం వహించారు. గత నెల 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు పెద్దగా మెప్పించలేకపోయింది. తాడాగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

ఈ సినిమా కథ వచ్చేసరికి.. తీస్ మార్ ఖాన్(ఆది సాయికుమార్) ఓ అనాథ. తనకు ఓ పూట అన్నం పెట్టిందనే మరో అనాథ అయిన వసు(పూర్ణ)ను అమ్మలా చుసుకుంటారు. వీరిద్దరిని ఓ పోలీస్ కానిస్టేబుల్ దత్తత తీసుకుని పెంచుతాడు. అయితే చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ జిమ్ సెంటర్ నడుపుకుంటున్న జీవితంలోకి జీజా(అనూప్ సింగ్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తాడు. జీజా ఓ గ్యాంగ్‌స్టర్. అతడి అరచకాలను అడ్డుకునేందుకు నేరుగా హోం మంత్రి శ్రీరంగ రాజన్(శ్రీకాంత్ అయ్యంగార్) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వసు హత్యకు గరువుతుంది. మరి వసును ఎవరు హత్య చేశారు? జీజాకు ఈ హత్యతో ఏమైనా సంబంధముందా? వసూ హత్యతో తీస్ మార్ ఖాన్ ఎలా రియాక్ట్ అయ్యాడు తదితర విషయాలను తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇందులో ఆది మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ అధికారి ఇలా మూడు వైవిధ్యమైన రోల్స్‌లో ఆది కనిపించాడు. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకు ప్రొడక్షన్ నెంబర్ 3, విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ నాగం తిరుపతి నిర్మాతగా వ్యవహరించారు. ఆది కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా చేసింది.నాటకం సినిమాకు దర్శకత్వం వహించిన కల్యాణ్ జీ గోగన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం