తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Polls 2024: మళ్లీ రాజకీయాల్లోకి బాలీవుడ్ నటుడు గోవిందా..! ఆ పార్టీ నుంచే లోక్ సభ బరిలోకి..!

Lok Sabha polls 2024: మళ్లీ రాజకీయాల్లోకి బాలీవుడ్ నటుడు గోవిందా..! ఆ పార్టీ నుంచే లోక్ సభ బరిలోకి..!

HT Telugu Desk HT Telugu

23 March 2024, 14:29 IST

    • Lok Sabha polls: బాలీవుడ్ నటుడు, హీరో గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండే తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
బాలీవుడ్ నటుడు, హీరో గోవిందా
బాలీవుడ్ నటుడు, హీరో గోవిందా

బాలీవుడ్ నటుడు, హీరో గోవిందా

Lok Sabha polls: లోక్ సభ ఎన్నికలకు ముందు నటుడు గోవిందా తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోవిందా నార్త్-వెస్ట్ ముంబై లోక్ సభ స్థానం నుండి ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల, మూడు రోజుల క్రితం, నటుడు గోవిందా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ను కలిశారు.

ట్రెండింగ్ వార్తలు

AP TS Polling Percentage : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోలింగ్- ఏపీలో 81 శాతం, తెలంగాణలో 64.74 శాతం!

AP Polling Percentage: ఏపీలో 80శాతం దాటనున్న పోలింగ్ శాతం... సాయంత్రానికి తేలనున్న లెక్కలు

Orugallu Polling: ఓరుగల్లులో గతానికంటే మెరుగైన పోలింగ్, వరంగల్ లో 68.29శాతం, మహబూబాబాద్ లో 70.68 శాతం నమోదు

Nagababu Tweet: నాగబాబు ట్వీట్‌తో మెగా అభిమానులు, మిత్ర పక్షాల్లో గందరగోళం.. లక్ష్యం అతడేనా?

గతంలో కాంగ్రెస్ లో..

2004 లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections 2024) ముంబై నార్త్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గోవిందా (Actor Govinda) బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్ ను ఓడించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ను వీడారు. కాగా, ముంబైలోని వర్లీలో శివసేన షిండే వర్గం పార్టీ క్యాడర్ తో సీఎం షిండే (Eknath Shinde) గురువారం లోక్ సభ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని షిండే పార్టీ సభ్యులకు సూచించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులివ్వాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ‘‘పార్టీ క్రమశిక్షణ పాటించాలి. ఎవరూ రాజులా ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా పనిచేయాలి. పార్టీ ఆదేశాలను పాటించాలి" అని మహారాష్ట్ర సిఎం అన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం మహాకూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాలపై చర్చ జరుగుతోందని, త్వరలోనే ప్రకటిస్తామని షిండే తెలిపారు. మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు గాను 45 స్థానాలను గెలుచుకోవాలని మహాకూటమి లక్ష్యంగా పెట్టుకుంది.

తదుపరి వ్యాసం