World Cup Semi Final: సెమీస్లో ఇండియాతో తలపడే టీమ్ ఏది? - పాకిస్థాన్కు ఛాన్స్ ఉందా?
08 November 2023, 12:57 IST
World Cup Semi Final: వన్డే వరల్డ్ కప్లో టీమ్ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్తో పాటు అప్ఘనిస్థాన్లలో సెమీస్లో అడుగుపెట్టే నాలుగో జట్టు ఏదన్నది ఆసక్తికరంగా మారింది.
వన్డే వరల్డ్ కప్
World Cup Semi Final: వరల్డ్ కప్లో సెమీస్ బెర్తును ఖాయం చేసుకునే జట్టు ఏదన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్లోకి అడుగుపెట్టాయి. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడనుంది. టీమ్ ఇండియాతో తలపడనున్న జట్టు ఏదన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఈ ప్లేస్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్తో పాటు అప్ఘనిస్థాన్ పోటీపడుతోన్నాయి. ప్రస్తుతం ఈ మూడు జట్లు తలో ఎనిమిది పాయింట్లతో కొనసాగుతోన్నాయి.
న్యూజిలాండ్ సెమీస్ చేరాలంటే...
న్యూజిలాడ్ సెమీస్లో అడుగుపెట్టాలంటే శ్రీలంకను ఆ జట్టు ఓడించాల్సి ఉంది. అలాగే ఇంగ్లాండ్, పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంపై కూడా న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు ఆధారపడ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఇంగ్లాండ్ 130కిపైగా పరుగులు తేడాతో ఓడిపోవాలి. అప్పుడే న్యూజిలాండ్కు సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి.
పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే...
పాకిస్థాన్కు సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ఇంగ్లాండ్ను భారీ తేడాతో ఓడించాలి. అలాగే శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలవ్వాలి. లేదంటే ఈ మ్యాచ్ రద్దు అయినా కూడా పాకిస్థాన్ సెమీస్ బెర్తు ఖాయమవుతుంది.
అప్ఘనిస్థాన్ సెమీస్లో అడుగుపెట్టాలంటే...
ఈ మూడు జట్లలో అప్ఘనిస్థాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా ఉన్నాయి. అప్ఘనిస్థాన్ సెమీస్ చేరుకోవాలంటే అద్భుతాలు జరగాలి. తనకంటే బలమైన సౌతాఫ్రికాపై అప్ఘనిస్థాన్ విజయం సాధించాలి. అలాగే న్యూజిలాండ్ను శ్రీలంక ఓడించాలి, ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలవ్వాలి. అప్పుడే అప్ఘనిస్థాన్ సెమీస్ చేరుకుంటుంది.