Ganguly on Pakistan Team: వరల్డ్ కప్సెమీస్లో ఇండియాతో పాకిస్థాన్ తలపడాలి - గంగూలీ కామెంట్స్ వైరల్
09 November 2023, 13:12 IST
Ganguly on Pakistan Team: వరల్డ్ కప్ సెమీస్లో పాకిస్థాన్ అడుగుపెట్టాలని సౌరభ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. సెమీ ఫైనల్లో ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలనుందని తెలిపాడు.
సౌరభ్ గంగూలీ
Ganguly on Pakistan Team: వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియాతో తలపడే జట్టు ఏదన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్తో పాటు అప్ఘనిస్తాన్ తలపడుతోన్నాయి. వరల్డ్ కప్ సెమీస్లో పాకిస్థాన్ అడుగుపెట్టాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు.
సెమీస్లో ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఉందని గంగూలీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఒకవేళ పాకిస్థాస్ సెమీస్ చేరితే రెండు జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా నవంబర్ 16న సెమీఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది.
న్యూజిలాండ్ లేదా అప్ఘనిస్థాన్ లలో ఏదో ఒక జట్టు సెమీస్లో అడుగుపెడితే ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నవంబర్ 15న సెమీస్ చేరిన జట్టు ఇండియాతో తలపడుతుంది. ఈడెన్ గార్డెన్ తన సొంత మైదానం కావడంతో పాకిస్థాన్ సెమీస్ చేరుకోవాలని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెబుతోన్నారు.
ఇండియా వరల్డ్ కప్ గెలవకపోతే ఆశ్చర్యమే...
వరల్డ్ కప్లో టీమిండియా ఆటతీరుపై గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "దేశ గర్వించేలా ఆటగాళ్లు అందరూ అద్భుత ప్రదర్శన చేస్తోన్నారు. ఒక్క ఓటమి లేకుండా ఎనిమిది మ్యాచుల్లో విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది.
ఇదే జోరును సెమీస్తో పాటు ఫైనల్లో కనబరిచితే ఇండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయంగానే కనిపిస్తోంది. నిలకడగా ఆడుతోన్న ప్లేయర్స్ ఆటతీరు ఒక్కసారిగా దారుణంగా పడిపోతుందని తాను అనుకోవడం లేదు" అని అన్నాడు. కానీ క్రికెట్ ఆటలో ఏదైనా జరగొచ్చునని, ఒకవేళ ఇండియా వరల్డ్ కప్ గెలవకపోయినా ఆశ్చర్యపోనవరం లేదని గంగూలీ తెలిపాడు.