Neeraj Chopra Rinku Singh: రింకూ సింగ్ కల తీరింది - నీరజ్ చోప్రాను కలిసిన ఐపీఎల్ స్టార్ - ఫొటో వైరల్
28 September 2023, 11:24 IST
Neeraj Chopra Rinku Singh: ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రాను కలవాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్. నీరజ్ చోప్రాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
నీరజ్ చోప్రా, రింకూ సింగ్
Neeraj Chopra Rinku Singh: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను కలుసుకున్నాడు. వీరిద్దరి కలయికకు హంకాంగ్ ఎయిర్పోర్ట్ వేదికగా మారింది. ఏషియన్ గేమ్స్ కోసం అనౌన్స్ చేసిన యంగ్స్టర్తో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు రింకూ సింగ్.
ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ ద్వారా తొలిసారి జాతీయ జట్టు తరఫున బరిలో దిగుతోన్నాడు. ఏషియన్ గేమ్స్కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రాను కలవాలన్నది తన కల అని రింకూ సింగ్ తెలిపాడు. తన కలను నెరవేర్చుకున్నాడు.
ఏషియన్ గేమ్స్ కోసం మెన్స్ క్రికెట్ టీమ్ బుధవారం చైనా చేరుకున్నది. ఈ గేమ్స్ కోసం నీరజ్ చోప్రా కూడా చైనా బయలుదేరాడు. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో నీరజ్ చోప్రాను మెన్స్ క్రికెట్ టీమ్ కలుసుకున్నది. ఈ సందర్భంగా తన అభిమాన అథ్లెట్ తో రింకూ సింగ్ ఫొటో దిగాడు.
ఈ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. నేషనల్ డ్యూటీ ఇన్ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ జోడించాడు. నీరజ్ చోప్రాతో రింకూ సింగ్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్పోర్ట్స్ లవర్స్ను ఈ ఫొటో ఆకట్టుకుంటోంది.
ఐపీఎల్ హీరో...
ఐపీఎల్ 2023 ద్వారా వెలుగులోకి వచ్చాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో ఐదు సిక్స్లు కొట్టడంతో ఒక్కసారిగా హీరోగా మారాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన రింకూ సింగ్ 59 యావరేజ్తో 474 రన్స్ చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.