తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sreesanth On Pakistan Team: ఇండియా సీ టీమ్‌ను కూడా పాకిస్థాన్ ఓడించ‌లేదు - పాక్ కోచ్‌కు శ్రీశాంత్ కౌంట‌ర్‌

Sreesanth on Pakistan Team: ఇండియా సీ టీమ్‌ను కూడా పాకిస్థాన్ ఓడించ‌లేదు - పాక్ కోచ్‌కు శ్రీశాంత్ కౌంట‌ర్‌

18 October 2023, 13:23 IST

  • Sreesanth on Pakistan Team: టీమ్ ఇండియా చేతిలో ఓట‌మి పాలైనా త‌మ జ‌ట్టు ఫైన‌ల్ చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పాకిస్థాన్ టీమ్ కోచ్ మైక్ అర్థ‌ర్ చేసిన కామెంట్స్‌కు శ్రీశాంత్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. టీమ్ ఇండియా సీ జ‌ట్టు సైతం పాకిస్థాన్ మెయిన్ టీమ్‌ను చిత్తుగా ఓడించ‌గ‌ల‌ద‌ని శ్రీశాంత్ అన్నాడు.

ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌
ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌

ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌

Sreesanth on Pakistan Team: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియా చేతిలో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. భార‌త బౌల‌ర్ల విజృంభ‌ణ‌తో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ సింపుల్ టార్గెట్‌ను టీమిండియా 30 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. టీమ్ ఇండియా చేతిలో ఓట‌మి పాలైనా పాకిస్థాన్ ఫైన‌ల్ చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆజట్టు కోచ్ మైక్ అర్థ‌ర్ కామెంట్స్ చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఇండియా, పాకిస్థాన్ త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన

DC vs LSG: స్టబ్స్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ దీటైన స్కోరు.. సూపర్ క్యాచ్ పట్టిన రాహుల్.. చప్పట్లతో అభినందించిన ఓనర్

Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై కన్నేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ద్రవిడ్ తర్వాత అతడేనా?

ఫైన‌ల్‌లో టీమ్ ఇండియాను ఓడించి తీరుతామ‌ని ప‌రోక్షంగా మైక్ అర్థ‌ర్‌ కామెంట్స్ చేశాడు. అత‌డికి టీమ్ ఇండియా మాజీ పేస‌ర్ శ్రీశాంత్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. టీమ్ ఇండియాను ఓడించే సీన్ పాకిస్థాన్‌కు లేద‌ని శ్రీశాంత్ అన్నాడు. ఐసీసీ టోర్నీలోనే కాదు ఎక్క‌డైనా పాకిస్థాన్‌పై టీమ్ ఇండియాదే పై చేయి అని తెలిపాడు. ఇండియా సీ టీమ్ సైతం పాకిస్థాన్ మెయిన్ టీమ్‌ను చిత్తుగా ఓడించ‌గ‌ల‌ద‌ని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

టీమ్ ఇండియా మాజీ ప్లేయ‌ర్స్‌తో ఓ ఐపీఎల్ టీమ్‌ను ఏర్పాటుచేసినా వారిపై కూడా పాకిస్థాన్ గెల‌వ‌లేద‌ని శ్రీశాంత్ చెప్పాడు. ఫైన‌ల్ చేరుతామంటూ పాకిస్థాన్ ప్లేయ‌ర్స్‌, మేనేజ్‌మెంట్ క‌ల‌లు క‌న‌డం మాన‌స్తే బెట‌ర్ అంటూ శ్రీశాంత్ స‌ల‌హా ఇచ్చాడు. శ్రీశాంత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ పాయింట్స్ టేబుల్ మూడు మ్యాచుల్లో మూడు విజ‌యాల‌తో టీమ్ ఇండియా టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా... మూడు మ్యాచుల్లో రెండు విజ‌యాల‌తో పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచింది.

తదుపరి వ్యాసం