Gautam Adani: అంబూజా సిమెంట్ లో వాాటా అమ్మేస్తున్న గౌతమ్ ఆదానీ
10 March 2023, 20:59 IST
Gautam Adani: అంబూజా సిమెంట్ (Ambuja Cement) లో తనకున్న వాటాలో 4% నుంచి 5% వరకు అమ్మేయాలని ఆదానీ గ్రూప్ (Adani Group) చైర్మన్ గౌతమ్ ఆదానీ (Gautam Adani) నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రతీకాత్మక చిత్రం
Gautam Adani to sell cement company shares: రుణ భారం తగ్గించుకోవాలని..
అంబూజా సిమెంట్ (Ambuja Cement) లో తనకున్న షేర్లలో 4% నుంచి 5% వరకు అమ్మేయడం ద్వారా కనీసం 450 మిలియన్ డాలర్లు వస్తాయని, వాటితో కొంత రుణ భారాన్ని తగ్గించుకోవాలని గౌతమ్ ఆదానీ (Gautam Adani) యోచిస్తున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. అంబూజా సిమెంట్ (Ambuja Cement) లో షేర్స్ అమ్మడం కోసం అంతర్జాతీయ కొనుగోలు దారులతో చర్చలు జరుగుతున్నాయని వివరించింది. ఆదానీ గ్రూప్ (Adani Group) ఆర్థిక అక్రమాలపై హిండన్ బర్గ్ రీసెర్చ్ వెల్లడించిన నివేదిక కారణంగా ఆదానీ గ్రూప్ (Adani Group) షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. అంబూజా సిమెంట్ (Ambuja Cement) లో వాటాను అమ్మి రుణ భారాన్ని కొంత తగ్గించుకోగలిగితే, ఆదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం మళ్లీ పెరుగుతుందని గౌతమ్ ఆదానీ (Gautam Adani) భావిస్తున్నారని వెల్లడించింది. అలాగే, మార్చి 9న చెల్లించాల్సి ఉన్న రుణాన్ని కూడా ఆదానీ గ్రూప్ ఇప్పటికే చెల్లించిందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.
Adani group shares: మళ్లీ పైపైకి..
ఆదానీ గ్రూప్ విశ్వాస కల్పన చర్యల కారణంగా ఆదానీ గ్రూప్ లోని కొన్ని కంపెనీలకు చెందిన షేర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆదానీ గ్రూప్ లోని మూడు కంపెనీల షేర్లను అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్ నర్స్ (GQG Partners) రూ. 15,447 కోట్లకు ఇటీవల కొనుగోలు చేసింది. ఈ మూడు కంపెనీలు కాకుండా, ఆదానీ పోర్ట్స్, ఆదానీ ఎంటర్ ప్రైజెస్, ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ల్లో జీక్యూజీ పార్ట్ నర్స్ (GQG Partners) కు వాటాలున్నాయి.