తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Illegal Affair : ఏక కాలంలో ఇద్దరితో అక్రమ సంబంధం….. ఒకరి హత్య

Illegal Affair : ఏక కాలంలో ఇద్దరితో అక్రమ సంబంధం….. ఒకరి హత్య

HT Telugu Desk HT Telugu

26 July 2022, 12:51 IST

    • కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో దారుణం జరిగింది. ఓ మహిళ ఏక కాలంలో ఇద్దరితో అక్రమ సంబంధం నెరుపుతుండటంతో, ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో  ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. 
వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య
వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య

వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య

అక్రమ సంబంధం నేపథ్యంలో కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి బద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కూడా ఆ మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి ఒకే సమయంలో ఇరువురూ మహిళ ఇంటికి రావడంతో వివాదం చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో శ్రీనివాసరెడ్డి హత్యకు గురయ్యాడు. దీంతో మహిళ అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందిన వెంటనే గుడివాడ డీఎస్పీ సత్యానందం అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు

తోట్లవల్లూరు మండలం ఆళ్ళ వారిపాలెంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఆకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి ఆళ్ల వారి పాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మహిళ కొంత కాలంగా ఆళ్ల వారి పాలెంకు చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి ఒకే సమయంలో ఇరువురు మహిళా ఇంటికి వచ్చారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో శ్రీనివాసరెడ్డి హత్యకు గురయ్యాడు.

ఆళ్లవారి పాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఆకునూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి లు ఓకే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన తర్వాత శ్రీకాంత్‌ రెడ్డితో పాటు మహిళ పరారైంది. పరారైన వివాహితకు 2ఏళ్ల కుమారుడితో పాటు నెలల పసిపాప ఉన్నట్లు గుర్తించారు. ఆమె భర్త మానసిక ఎదుగుదల సరిగా లేదని గ్రామస్తులు చెబుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం