Pawan Kalyan : వాటిల్లో క్లాస్, మాస్టర్ క్లాస్ - వైసీపీపై పవన్ వ్యంగ్యాస్త్రాలు
01 February 2023, 17:16 IST
- Pawan Kalyan Fires On CM YS Jagan: ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్… విమర్శల వర్షం గుప్పించారు. ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఏపీ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్
Pawan Kalyan Slams YCP Govt: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. మన ముఖ్యమంత్రి సంపాదన దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ సంపాదన అని.. అసలు దేశంలో జగన్ క్లాసే వేరంటూ సెటైర్లు విసిరారు. వైసీపీ రాజ్యంలో ప్రజలందర్నీ బానిసలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల శ్రమ, గౌరవం, జీవితాలు కొంతమందికి అమ్ముడుపోయాయని పవన్ పేర్కొన్నారు. వైసీపీ వారిని ట్యాక్స్ పేయర్ గానే చూస్తుందని, ఇది నిజంగా క్లాస్ అంటూ పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు.. ఇదో మాస్టర్ క్లాస్ అంటూ పవన్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల స్వర్గాన్ని ఆంధ్రానికి తీసుకొచ్తిన వేళ ఇంకా దావోస్ ఎవరికి కావాలి అంటూ ట్వీట్ చేశారు. ఇక మన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్, చాయ్ పాయింట్లు ప్రారంభిస్తున్నారు. ఇక ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం వేచి చూడాలి అని మంత్రిని పవన్ టార్గెట్ చేశారు. ఇది కూడా మరో క్లాస్ యాక్ట్ అని చెప్పుకొచ్చారు. అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి . కామ్రేడ్ పుచ్చలిపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడుతున్నారు. ఇదేం చోద్యం’ అంటూ పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.
"ఆక్సిమొరాన్ అనగా.. విరుద్ధమైన రెండు పదాల కలయిక. మన ముఖ్యమంత్రి ఆదాయం దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ. అసలు దేశంలో జగన్ క్లాస్ వేరు. భూమి నుంచి ఇసుక వరకు . మధ్యం నుంచి గనులు, అడవుల నుండి కొండల వరకు.. కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతీ పైసా కూడా ధనిక సీఎం చేతిలో ఉంది" అంటూ పవన్ మండిపడ్డారు.