ఏపీలో మరో పేలుడు… ఇద్దరు మృతి
19 August 2022, 15:48 IST
- blast in factory at kakinada: ఏపీలో మరో పేలుడు సంభవించింది. కాకినాడ ప్యారీ షుగర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఏపీలో పేలుడు
blast in factory at kakinada: కాకినాడ సమీపంలో పేలుడు సంభవించింది. వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ(36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వరరావు(45)లను మృతులుగా గుర్తించారు. విద్యుదాఘాతం కారణంగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన వారిని కాకినాడ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
గురువారం విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఆటోనగర్లో టిఫిన్ సెంటర్ వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి టిఫిన్ సెంటర్లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించినా.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు.
టాపిక్