తక్కువ ధరలోనే మంచి టూరిస్ట్ ప్రాంతాలకు తెలంగాణ టూరిజం పలు రకాల ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఏపీ, తెలంగాణే కాకుండా మిగతా రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అయితే తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు సమీపంలో ఉన్న ప్లేసులను చూసేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి సాగర్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కేవలం ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో జర్నీ ఉంటుంది. అంతకంటే ముందుగానే టూరిస్టులు బుకింగ్ చేసుకోవాలి. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మరోవైపు సాగర్ కు అతిసమీపలో ఉండే వైజాగ్ కాలనీకి చాలా మంది టూరిస్టులు వెళ్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి అతి దగ్గర సమీపంలో ఉంటుంది వైజాగ్ కాలనీ. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు సమీపంగా ఈ టూరిజం స్పాట్ ఉంటుంది.
నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది. గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇక్కడ ఉంటుంది. చుట్టు కొండలు ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే,,, ఐల్యాండ్ అని అనొచ్చు. ఇక్కడికి టూరిస్టులు చాలా మంది వస్తుంటారు.
సాగర్ హైవేపై ఉండే మల్లేపల్లి నుంచి 32 కి.మీ. దూరంలో ఈ వైజాగ్ కాలనీ ఉంటుంది. ఇక్కడ నైట్ క్యాంపులను కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. విశాఖ జిల్లా నుంచి వచ్చిన మత్స్యకారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వీకెండ్ లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఈ ప్లేస్ ను ఎంచుకోవచ్చు.