Telangana assembly election 2023: బీజేపీ రోడ్ మ్యాప్ పల్లె గోస.. బీజేపీ భరోసా-bjps road map ready for 2023 telangana assembly elections palle gosa bjp bharosa program to start on july 21 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly Election 2023: బీజేపీ రోడ్ మ్యాప్ పల్లె గోస.. బీజేపీ భరోసా

Telangana assembly election 2023: బీజేపీ రోడ్ మ్యాప్ పల్లె గోస.. బీజేపీ భరోసా

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 11:03 AM IST

Telangana assembly election 2023: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.

ఇటీవలి విజయ సంకల్ప సభలో బండి సంజయ్‌తో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఇటీవలి విజయ సంకల్ప సభలో బండి సంజయ్‌తో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ANI)

న్యూఢిల్లీ, జూలై 13: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. జూలై 21 నుంచి 'పల్లె గోస - బీజేపీ భరోసా' పేరుతో బీజేపీ 15 ప్రాంతాల్లో మోటార్‌సైకిల్‌ యాత్ర చేపట్టనుంది.

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్టు ప్రకటించింది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని, బూత్ పటిష్టత కార్యక్రమం కొనసాగుతోందని, రానున్న రోజుల్లో తెలంగాణకు 30 మంది కేంద్రమంత్రులు కూడా వస్తారని బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు సంకల్పించారని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్ప యాత్రలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారని తరుణ్ చుగ్ అన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా తెలంగాణపై సానుకూల ప్రభావం చూపిందని ఆయన అన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా తెలంగాణపై సానుకూల ప్రభావం చూపిందని, ఇది వచ్చే ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)పై పైచేయి సాధించేందుకు వీలుగా తెలంగాణలోని పార్టీ నాయకులు, క్యాడర్‌లో విశ్వాస స్థాయిలను పెంచిందని ఆయన నొక్కి చెప్పారు.

జులై 21న ప్రారంభం కానున్న 'పల్లె గోస - బీజేపీ భరోసా' కార్యక్రమ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది సీనియర్‌ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది నేతలు అవగాహన ర్యాలీలో పాల్గొంటారు.

ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు వీలుగా నాయకులు బైక్‌ ర్యాలీలు నిర్వహించేలా, ప్రతి నియోజకవర్గానికి ఓ కీలక నేత వెళ్లేలా ప్లాన్‌ చేశారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రాజకీయంగా రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్‌ఎస్‌లో ఎందరో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.

విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. 'బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్‌కు ఎలా తెలుసు.. బీజేపీకి వ్యూహం లేకుండానే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుందా.. సీఎం మాట్లాడుతున్న భాష చాలా సిగ్గుచేటు..’ అని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point

టాపిక్