Virat Kohli in Rishikesh Ashram: ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఆధ్యాత్మిక యాత్రలో విరాట్.. ఫొటోలు వైరల్-virat kohli in rishikesh ashram ahead of four tests series against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli In Rishikesh Ashram Ahead Of Four Tests Series Against Australia

Virat Kohli in Rishikesh Ashram: ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఆధ్యాత్మిక యాత్రలో విరాట్.. ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu
Jan 31, 2023 11:29 AM IST

Virat Kohli in Rishikesh Ashram: ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. భార్య అనుష్క శర్మతో కలిసి రిషికేష్ ఆశ్రమంలో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

రిషికేష్ ఆశ్రమంలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
రిషికేష్ ఆశ్రమంలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ

Virat Kohli in Rishikesh Ashram: క్రికెట్ ఫీల్డ్ లో ఎంత దూకుడుగా కనిపించినా బయటమాత్రం విరాట్ కోహ్లి చాలా కూల్ గా ఉంటాడు. అతనికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. వీలు చిక్కినప్పుడల్లా గుళ్లూ, గోపురాలు, ఆశ్రమాలు తిరుగుతుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ తన భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి రిషికేష్ లోని ఓ ఆశ్రమానికి వెళ్లాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి లభించడంతో కోహ్లి ఈ ఆధ్యాత్మక యాత్రకు వెళ్లాడు. రిషికేష్ లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో విరాట్ కనిపించాడు. అక్కడి బ్రహ్మాలిన్ దయానంద్ సరస్వతి సమాధిని సందర్శించాడని, ఆ తర్వాత గంగా ఘాట్ లో గంగా హారతిలోనూ విరాట్ పాల్గొన్నాడని ఆశ్రమం పీఆర్వో గుణానంద్ రాయల్ వెల్లడించారు.

రెండు రోజులుగా వీళ్లు ఆశ్రమంలోనే ఉన్నారు. కోహ్లి, అనుష్కతో పాటు వాళ్ల యోగా ట్రైనర్ కూడా వెంట ఉన్నారు. మంగళవారం (జనవరి 31) ఉదయం ఆశ్రమంలో నిర్వహించే భండారా అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి కూడా కోహ్లి ఫ్యామిలీ ఆశ్రమంలోనే ఉండనుంది. ఈ సందర్భంగా ఆశ్రమంలోని భక్తులతోనూ వీళ్లు సెల్ఫీలు దిగారు.

ఇంతకుముందు కోహ్లి, అనుష్క బృందావన్‌లోని ఆశ్రమానికి కూడా వెళ్లారు. అక్కడ శ్రీ పరమానంద ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే శ్రీలంకతో సిరీస్ ఆడాడు. ఆ సిరీస్ లో విరాట్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ చెలరేగాలని భావిస్తున్న కోహ్లి.. ఆ కీలకమైన సిరీస్ కు ముందు రిషికేష్ ఆశ్రమానికి వెళ్లాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం బుధవారం (ఫిబ్రవరి 1) ఆస్ట్రేలియా టీమ్ ఇండియా రానుంది. నాగ్‌పూర్ లో 9వ తేదీని మ్యాచ్ ప్రారంభం వరకూ బెంగళూరులోనే ఉండి ప్రాక్టీస్ చేయనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం