తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అశ్వవాహ‌నంపై శ్రీనివాసుడు విహారం-tirumala brahmotsavam 2023 srivaru on aswa vahanam ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Tirumala Brahmotsavam 2023 Srivaru On Aswa Vahanam

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అశ్వవాహ‌నంపై శ్రీనివాసుడు విహారం

Sep 25, 2023, 10:12 PM IST Bandaru Satyaprasad
Sep 25, 2023, 10:12 PM , IST

  • తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీవారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 

(1 / 5)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మలయప్పస్వామి వారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. 

(2 / 5)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమ‌వారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో మలయప్పస్వామి వారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. 

సోమవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహ‌న‌సేవ జ‌రిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో  స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

(3 / 5)

సోమవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహ‌న‌సేవ జ‌రిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో  స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.  

(4 / 5)

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.  

బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిపుష్కరిణిలో స్నప‌న తిరుమంజ‌నం, చ‌క్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.

(5 / 5)

బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిపుష్కరిణిలో స్నప‌న తిరుమంజ‌నం, చ‌క్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు