(1 / 5)
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల లైట్లతో అలంకరించారు.
(HT Telugu)(2 / 5)
నర్సంపేట పట్టణంలోని వల్లభ్నగర్లో అయోధ్య రామమందిరం ప్రతిభింబించేలా వేదికను ఏర్పాటు చేశారు. రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
(HT Telugu)(3 / 5)
అమ్మవారిని ప్రతిష్టించేందుకు ఆలయాన్ని రూపొందించారు. అచ్చం అయోధ్య రామమందిరంలా దీన్ని తీర్చిదిద్దారు. ఆ ఆలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు.
(HT Telugu)(4 / 5)
ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయం ముందే బతుకమ్మ సంబరాలు ప్రారంభం అయ్యాయి. మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలతో వచ్చారు. ఆలయం ప్రాంగణంలో ఆట, పాటలతో సందడి చేశారు.
(HT Telugu)(5 / 5)
ఇటు నర్సంపేట పట్టణం మొత్తం విద్యుత్ కాంతులతో నిండిపోయింది. బస్టాండ్ కూడలిలో ఉన్న కాకతీయ కళా తోరణాన్ని లైట్లతో అలంకరించారు. అది స్పషల్ అట్రాక్షన్గా నిలించింది.
(HT Telugu)ఇతర గ్యాలరీలు