Crime : చపాతీలు అడిగినందుకు కస్టమర్​ను కొట్టి చంపిన హోటల్​ సిబ్బంది!-up crime news man beaten to death over rotis on birthday issue ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime : చపాతీలు అడిగినందుకు కస్టమర్​ను కొట్టి చంపిన హోటల్​ సిబ్బంది!

Crime : చపాతీలు అడిగినందుకు కస్టమర్​ను కొట్టి చంపిన హోటల్​ సిబ్బంది!

Sharath Chitturi HT Telugu
Jun 28, 2022 11:27 AM IST

UP crime news : ఆ రోజు అతని పుట్టిన రోజు. కానీ అదే అతనికి చివరి రోజు అవుతుందని ఊహించలేదు. పార్టీ కోసం చపాతీలు ఆర్డర్​ ఇచ్చిన అతను.. అనంతరం జరిగిన గొడవతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తక్కువ చపాతీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడంతో హోటల్​ సిబ్బంది అతడిని కొట్టి చంపేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

చపాతీలు అడిగినందుకు కస్టమర్​ను కొట్టి చంపిన హోటల్​ సిబ్బంది!
చపాతీలు అడిగినందుకు కస్టమర్​ను కొట్టి చంపిన హోటల్​ సిబ్బంది! (HT Telugu)

UP crime news : ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చపాతీలు అడిగిన ఓ కస్టమర్​ను హోటల్​ సిబ్బంది దారుణంగా కొట్టి చంపేసింది.

ప్రశ్నిస్తే.. చంపేశారు!

చానెహత ప్రాంతంలో 30ఏళ్ల సన్నీ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు. సెలబ్రేషన్స్​లో భాగంగా స్థానికంగా ఉండే ఓ రెస్టారెంట్​లో 150 చెపాతీలు ఆర్డర్​ ఇచ్చి, డబ్బులు కూడా చెల్లించాడు. కానీ రెస్టారెంట్​ నుంచి అతనికి కేవలం 40 చపాతీలు మాత్రమే అందాయి.

అసలు విషయం తెలుసుకునేందుకు.. తన బంధువుతో కలిసి ఆ రెస్టారెంట్​కి వెళ్లాడు సన్నీ. ఆ సమయంలో రెస్టారెంట్​ ఓనర్​ జీషాన్​ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. సన్నీపై జీషాన్​, అతని సిబ్బంది దాడికి దిగారు. కర్రలతో సన్నీని, అతని బంధువు బబ్లూను కొట్టారు.

తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సన్నీ ప్రాణాలు కోల్పోయాడు. బబ్లూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ పూర్తి వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడి తండ్రి.

రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనకు సంబంధించి ముగ్గురుని అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న జీషాన్​ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వ్యవహారం రెండు మతాలకు సంబంధించిన వర్గాల మధ్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం