Tata Motors : వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్​..-tata motors hikes passenger vehicle prices ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tata Motors Hikes Passenger Vehicle Prices

Tata Motors : వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్​..

Sharath Chitturi HT Telugu
Jul 09, 2022 12:48 PM IST

Tata Motors price hike : వాహనాల ధరలను టాటా మోటార్స్​ మరోమారు పెంచింది. 0.55శాతం పెంపు శనివారం నుంచే అమల్లోకి వచ్చింది.

వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్​..
వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్​.. (HT_PRINT)

Tata Motors price hike : మధ్యతరగతి ప్రజలకు టాటా మోటార్స్​ మరో షాక్​ ఇచ్చింది. ప్యాసింజర్​ వాహనాల ధరలను మళ్లీ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు వెల్లడించింది. ముడిసరకు ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.

ప్యాసింజర్​ వాహనాల ధరలను తాజాగా 0.55శాతం పెంచింది టాటా మోటార్స్​. మోడల్​, వేరియంట్​ ఆధారంగా ఈ పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. ముడిసరకు ధర పెరుగుదలతో పోల్చితే.. తమ కంపెనీ చాలా తక్కువ రేట్​ హైక్​ తీసుకుంటోందని వెల్లడించింది.

టాటా మోటార్స్​కు చెందిన టాటా పంచ్​, నెక్సాన్​, హారియర్​, సఫారీ వంటి మోడల్స్.. ప్రస్తుతం మార్కెట్​లో​ టాప్​లో ఉన్నాయి.

ఈ నెలలో టాటా మోటార్స్​ వాహనాల ధరలు పెరగడం ఇది రెండోసారి! ఈ నెలలో టాటా మోటార్స్​ ధరలను ఇప్పటికే 1.5-2.5శాతం పెంచింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్