Gujarat assembly elections 2022 : 5ఏళ్లల్లో ఎన్నో 'రాజకీయాలు'.. ఈసారి ఫలితమేంటి?-gujarat assembly elections 5 years on how state s political arena changed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Assembly Elections, 5 Years On, How State's Political Arena Changed

Gujarat assembly elections 2022 : 5ఏళ్లల్లో ఎన్నో 'రాజకీయాలు'.. ఈసారి ఫలితమేంటి?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 04, 2022 08:11 PM IST

Gujarat assembly elections 2022 : 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తగ్గింది, కాంగ్రెస్​కు ఊహించని విధంగా సీట్లు వచ్చాయి. ఈ పరిణామాలకు అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇప్పటి పరిస్థితేంటి? ఆప్​ ఎంట్రీతో బీజేపీ, కాంగ్రెస్​కు నష్టం తప్పదా?

5ఏళ్లల్లో ఎన్నో రాజకీయ మార్పులు.. ఈసారి ఫలితమేంటి?
5ఏళ్లల్లో ఎన్నో రాజకీయ మార్పులు.. ఈసారి ఫలితమేంటి? (PTI)

Gujarat assembly elections 2022 : గుజరాత్​లో 'ఎన్నికల వార్​' ఎప్పుడూ వన్​ సైడే! ఇక్కడ ఎన్నో ఏళ్లుగా బీజేపీదే ప్రభుత్వం. కానీ గత ఎన్నికలను పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. 2017 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గాయి, కాంగ్రెస్​కు పెరిగాయి. మరి ఇప్పటి పరిస్థితేంటి? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా ఆప్​ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. 2017కు 2022 ఎన్నికలకు మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాము..

ట్రెండింగ్ వార్తలు

2017 ఫలితాలు ఇలా..

గుజరాత్​లో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇక్కడ బీజేపీ 99 సీట్లల్లో గెలిచింది. 27ఏళ్ల నుంచి బీజేపీ.. రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పటికీ.. 1995 తర్వాత ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి. అదే సమయంలో.. కాంగ్రెస్​కు 77 స్థానాలు దక్కాయి. 1985 తర్వాత ఈ స్థాయి ప్రదర్శన.. కాంగ్రెస్​కు ఇదే మొదటిసారి. 

ఈసారి రెండు దఫాల్లో డిసెంబర్​ 1,5న పోలింగ్​ జరగనుంది.

Gujarat assembly elections 2017 results : కానీ.. 2017 ఎన్నికల నుంచి ఇప్పటికీ.. సమీకరణలు చాలా మారిపోయాయి. పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలు వంటి పరిణామాలతో అసెంబ్లీలో బీజేపీ బలం 111కి చేరింది.

2017 ఎన్నికలన్నీ వీటి చుట్టూనే..!

2017 గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలు పటీదార్ల నిరసనల చుట్టే సాగాయి.!విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్లు పెద్ద ఎత్తున్న ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

గుజరాత్​లో వ్యాపారులు ఎక్కువగా ఉంటారన్న విషయం తెలిసిందే. జీఎస్​టీ అమలుతో.. వీరికి ఊహించని విధంగా నష్టాలు వాటిల్లినట్టు అప్పట్లో ప్రచారాలు జరిగాయి. ఫలితంగా అనాదిగా అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత పెరిగింది.

Gujarat assembly elections 2022 date : ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. కాంగ్రెస్​ మెరుగైన ప్రదర్శన చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. హార్దిక్​ పటేల్​, అల్పేష్​ థకోరే, జిగ్నేష్​ మేవాని రూపంలో కాంగ్రెస్​కు యువ రక్తం దొరికింది. ఎన్నికలను వీరు.. భుజాలపై మోసుకుని ముందుకెళ్లారు.

పటీదార్ల ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా పేరు తెచ్చుకున్నారు హార్దిక్​ పటేల్​. రాష్ట్రంలో పటీదార్ల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. రిజర్వేషన్ల కోసం 2015 నుంచి భారీ ఎత్తున ఉద్యమాలు జరిగాయి. వీటి మధ్య.. పటేల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

కానీ ఐదేళ్లల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. హార్దిక్​ పటేల్​తో పాటు అల్పేష్​.. బీజేపీలో చేరిపోయారు. మేవానీ.. కాంగ్రెస్​లోనే ఉన్నా.. ఆయన పట్టు.. రాష్ట్రంలోని 6.74శాతం జనాభా కలిగిన దళితులపైనే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి పరిస్థితులేంటి..?

gujarat assembly elections BJP : 2022 గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమం ఊసే లేదు! జీఎస్​టీని వ్యాపారులు జీర్ణించేసుకున్నారు. ఫలితంగా.. నాడు అత్యంత కీలకంగా ఉన్న ఈ విషయాలు.. ఇప్పుడు అటకెక్కేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.

ఇక ప్రభుత్వ వ్యతిరేకను అణచివేసేందుకు బీజేపీ చర్యలు చేపట్టింది. గతేడాది.. సీఎం పదవి నుంచి విజయ్​ రూపానీని తప్పించి, ఆ బాధ్యతలను భూపేంద్ర పటేల్​కు అప్పగించింది. కేబినెట్​ మొత్తాన్నీ మార్చేసింది. మరో అడుగు ముందుకేసి.. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు.. సిట్టింగ్​ ఎమ్మెల్యేల్లో 30శాతం మందిని ఈసారి వదిలించుకనే ప్రయత్నంలో కమలదళం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

gujarat assembly elections Congress : ఇదిలా ఉండగా.. 2017లో మెరుగైన ప్రదర్శన చేసిన కాంగ్రెస్​.. అక్కడి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంలో చతికిల పడింది. చాలా మంది కీలక నేతలు పార్టీని వదిలేశారు. ఐదేళ్లల్లో.. 16మంది కాంగ్రెస్​ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది పార్టీకి నష్టమే అని పలువురు అంటున్నారు.

కానీ కాంగ్రెస్​ వాదన మాత్రం మరో విధంగా ఉంది. మూడు నెలల్లో.. రాష్ట్రంలోని 80శాతం ఇళ్లకు కాంగ్రెస్​ కార్యకర్తలు చేరారని, ఈసారి గెలుపు తమదేనని చెబుతోంది. ఇందుకు ఆధారాలు ఉన్నాయా? అంటే మాత్రం మౌనంగా ఉండిపోతోంది.

ఆప్​ ఎంట్రీ.. మార్పు తప్పదా?

గుజరాత్​లో అధికారం.. అనాదిగా బీజేపీదే. కానీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్​ ఉంది. పోటీ ఎప్పుడూ ఈ రెండు పార్టీల మధ్యే జరిగేది. కానీ ఇప్పుడు ఎన్నికల యుద్ధంలోకి ఆమ్​ ఆద్మీ ఎంట్రీ ఇచ్చింది. 'తగ్గేదే' అన్న రేంజ్​లో ప్రచారాలు చేస్తున్నారు అరవింద్​ కేజ్రీవాల్​. ఆగస్టు నుంచి నెలకు రెండుసార్లు చొప్పున ఇప్పటికే ఎన్నోసార్లు గుజరాత్​లో పర్యటించారు. ఉచితాల హామీలతో ప్రజలకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గెలుపు తమదేనని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు.

Gujarat AAp : ఆప్​ ఎంట్రీతో కాంగ్రెస్​కే చేటు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్​ ఓటు బ్యాంక్​పై ఆప్​ దెబ్బకొట్టే అవకాశాలు భారీగా ఉన్నాయని చెబుతున్నారు.

మరి ఈ త్రిముఖ పోరులో గెలుపెవరిది? బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంగడతారా? కాంగ్రెస్​కు ఈసారైనా అవకాశం లభిస్తుందా? లేక మార్పు పేరుతో ప్రజలు ఆమ్​ ఆద్మీకి ఓటేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం.. ఎన్నికల ఫలితాల తేది డిసెంబర్​ 8తో తేలిపోతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం