Gold rates today : భారీగా పడిన బంగారం ధర.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం!-gold and silver rates today 2 september ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Rates Today : భారీగా పడిన బంగారం ధర.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం!

Gold rates today : భారీగా పడిన బంగారం ధర.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం!

Sharath Chitturi HT Telugu
Sep 02, 2022 06:14 AM IST

Gold rates today : దేశంలో పసిడి ధరలు భారీగా పడ్డాయి. వెండి ధరలు పెరిగాయి. ఆ లెక్కలు ఇలా ఉన్నాయి..

మీ నగరాల్లో నేటి బంగారం ధర ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధర ఇలా.. (PTI)

Gold rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 500 దిగొచ్చి.. రూ. 46,500కి చేరింది. గురువారం ఈ ధర రూ. 47,000గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5000 పడి, రూ. 4,65,000కి చేరింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 540 తగ్గి.. రూ. 50,730కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,270గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 5,400 దిగొచ్చి.. రూ. 5,07,300గా ఉంది.

Gold price in telugu : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,730గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,100గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,380గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,530గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,760గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,550గాను.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గాను ఉంది. ఇక లక్నోలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,700గాను.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,950గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,160గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 800 పెరిగి.. 51,600కి చేరింది. గురువారం ఈ ధర రూ. 50,800గానే ఉండేది.

Silver rate today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 58,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 51,600.. బెంగళూరులో రూ. 58,000.. ముంబైలో రూ. 51,600.. చెన్నైలో రూ. 58,000గా ఉన్నాయి.

వెండి ధర పుణెలో రూ. 51,600గా ఉండగా.. అహ్మదాబాద్​, జైపూర్, లక్నో​లో సైతం ఇదే రేటు కొనసాగుతోంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు (గురువారం) కాస్త పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 పెరిగి.. రూ 21,560కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 21,410గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 21,560గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

IPL_Entry_Point

సంబంధిత కథనం