G20 summit in India : జీ20 సదస్సు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..!
G20 summit in India : జీ20 సదస్సుకు దిల్లీ సిద్ధమైంది. దేశాధినేతల రాక మొదలైంది. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
G20 summit in India : శని, ఆదివారాలు జరగనున్న జీ20 సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతాపరమైన నిబంధనలు గురువారం రాత్రి నుంచే ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తున్నాయి. దేశాధినేతలు కూడా ఒక్కొక్కరుగా దిల్లీలో అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీ20 సమిట్ అంటే ఏంటి? ఇండియాలో జరుగుతున్న ఈ సదస్సు ఎందుకు కీలకంగా మారనుంది? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
జీ20 సదస్సు అంటే ఏంటి?
జీ20 అంటే 'గ్రూప్ ఆఫ్ 20'. ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కలిసి ఉంటుంది. 1999లో ఈ జీ20ని స్థాపించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ప్రణాళికలు రచించేందుకు ఇది వేదికగా మారింది. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను జీ20 వేదికగా దేశాధినేతలు చర్చించి, పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
G20 summit 2023 : అయితే ప్రస్తుతం ఈ జీ20 సదస్సు గ్లోబల్ ఎకానమీపైనే దృష్టి సారించడం లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ.. ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రేడింగ్, సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, వాతావరణ మార్పులు వంటి అంశాలు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియల్, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అంటే.. 85శాతం ప్రపంచ జీడీపీ, 75శాతం గ్లోబల్ ట్రేడ్, మూడింట రెండో వంతు ప్రపంచ జనాభాకు ఈ జీ20 సదస్సు ప్రాతినిథ్యం వహిస్తుంది.
ఇదీ చూడండి:- G20 Summit in Delhi : జీ20 సదస్సుకు దిల్లీ సిద్ధం- ఏవి మూతపడతాయి? ఏవి ఓపెన్గా ఉంటాయి?
జీ20 లక్ష్యాలు..
G20 summit 2023 Delhi : 1999లో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో ఆసియా దేశాలు విలవిలలాడిపోయాయి. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు లేదా నివారించేందుకు.. వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్లు ఒక్క చోట చేరి సమాలోచనలు చేసేందుకు ఏర్పాటు చేసిందే ఈ జీ20.
అయితే ఈ జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే బాధ్యతలు ప్రతిసారి మారుతూ ఉంటాయి. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. 20 దేశాలు 5 గ్రూపులుగా విడిపోయి ఉంటాయి. ఈ గ్రూప్ల మధ్య అధ్యక్షత బాధ్యతలు తిరుగుతూ ఉంటాయి. ఈసారి.. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు బాధ్యత వహించే అవకాశం ఇండియాకు దక్కింది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఈ బాధ్యతలు ఇండియా వద్దే ఉంటాయి. ఆ తర్వాత బ్రెజిల్ చేతుల్లోకి వెళతాయి.
జీ20 సదస్సు అధ్యక్షత వహించే దేశం.. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన అజెండాను రూపొందిస్తుంది. సమిట్కు హోస్ట్ చేస్తుంది. ఈసారి 9-10 తేదీల్లో జరగనున్న సదస్సు హైలైట్గా మారినప్పటికీ.. వివిధ అంశాలపై ఏడాది పొడవునా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి.
2023 జీ20 సదస్సు లక్ష్యాలు ఇవే..
What is G20 summit : జీ20 సమిట్లో ప్రధాన లక్ష్యం.. దేశాల ఆర్థిక వ్యవస్థను బలపరచడమే. దీనితో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
- గ్రీన్ గ్రోత్ వృద్ధి, వాతావరణ మార్పులపై పోరాటానికి ఆర్థిక సాయం, క్వాలిటీ ఆఫ్ లైఫ్.
- వేగవంతమైన, అందరిని కలుపుకుని వెళ్లే, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, విస్తరించడం ప్రోత్సహించడం.
- ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాల) పురోగతిని పరిశీలించడం
- యూఎన్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ని 21వ శతాబ్దానికి తగ్గట్టు సంస్కరించడం.
- మహిళా నాయకత్వంలో అభివృద్ధిని సాధించడం.
వీరు రావట్లేదు..!
G20 summit 2023 date : ఈ దఫా జీ20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావట్లేదు. వీరి తరఫున ఆయా దేశాలకు చెందిన ఇతర అధికారులు ఇండియాకు వస్తున్నాయి. ఇక చివరి నిమిషంలో కొవిడ్ పాజిటివ్ తేలడంతో.. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాన్చెజ్ కూడా ఇండియాకు రావట్లేదు.
సంబంధిత కథనం