Alluri Trailer Released: లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం.. శ్రీ విష్ణు అల్లూరి ట్రైలర్ వచ్చేసింది -sree vishnu new movie alluri trailer released by hero nani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sree Vishnu New Movie Alluri Trailer Released By Hero Nani

Alluri Trailer Released: లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం.. శ్రీ విష్ణు అల్లూరి ట్రైలర్ వచ్చేసింది

Maragani Govardhan HT Telugu
Sep 16, 2022 08:05 PM IST

Alluri trailer Released: శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం అల్లూరి ట్రైలర్‌ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.

అల్లూరి ట్రైలర్ విడుదల
అల్లూరి ట్రైలర్ విడుదల

Alluri trailer Release by Nani: శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం అల్లూరి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అంచనాలను పెంచేశాయి. ఎప్పుడూ పక్కింటి కుర్రాడి పాత్రలను చేసే శ్రీ విష్ణు ఈ సినిమాతో ఫుల్ మాస్ హీరో అవతారమెత్తాడు. సెప్టెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం నిర్వహించనుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, డైలాగులు ఇలా అన్నీ సమపాళ్లలో ఇందులో ఉన్నాయి. "పోలీసంటే వ్యక్తి కాదు సర్ వ్యవస్థ.. ఆ వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే.. మరో పోలీస్ ఆఫీసర్ వస్తాడు సర్" అంటూ ఖాకీల గురించి అదిరిపోయే డైలాగ్ చెప్పాడు శ్రీవిష్ణు. "లక్ష్యం పెట్టుకోవడం గొప్ప కాదు.. దాన్ని సాధించడం గొప్పకాదు. లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం" అని తనికెళ్ల భరణి స్ఫూర్తి నింపే సంభాషణలు ఆకట్టుకుంటాయి.

ఎఎస్ రామారాజు పాత్రలో శ్రీ విష్ణు ఇందులో ఒదిగిపోయారు. ఆయన చేసిన ఈ కొత్త ప్రయత్నం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ అద్యంతం పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌లా అలరించింది. ఫిక్షన్ బయోపిక్‌గా దీన్ని తెరకెక్కించారు. అంటే నిజ జీవిత సంఘటనలతో పాటు కొన్ని కల్పిత సంఘటనలతో ఈ కథను రాశారు. సెప్టెంబరు 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కమ్ వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. కయాడు లోహర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేయగా.. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్