Maa Oori Polimera Sequel: బిగ్బాస్ బాలాదిత్య సినిమాకు సీక్వెల్ రాబోతోంది
Maa Oori Polimera Sequel: బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ రాబోతున్నది. త్వరలోనే ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయబోతున్నారు.
Maa Oori Polimera Sequel: ప్రస్తుతం టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా సీక్వెల్స్ తీసుకొస్తున్నారు. బిగ్బాస్ ఫేమ్ బాలాదిత్య, సత్యం రాజేష్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ రాబోతున్నది.
మా ఊరి పొలిమేర -2 పేరుతో సెకండ్ పార్ట్ను రూపొందిస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ ఈ సీక్వెల్ను తెరకెక్కించబోతున్నారు. ఫస్ట్ పార్ట్లో కనిపించిన నటీనటులు అందరూ ఈ సీక్వెల్లో ఉంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ఉత్తరాఖండ్, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షూటింగ్ను పూర్తిచేసినట్లు నిర్మాత గౌరికృష్ణ పేర్కొన్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నట్లు వెల్లడించాడు. చేత బడుల నేపథ్యంలో మా ఊరి పొలిమేర సినిమా రూపొందింది. తన అన్న మరణానికి కారణాల్ని అన్వేషించే క్రమంలో అతడి తమ్ముడైన ఓ కానిస్టేబుల్ తెలుసుకున్న నిజాలేమిటనే పాయింట్ నేపథ్యంలో మా ఊరి పొలిమేర సినిమా తెరకెక్కింది.
ఫస్ట్ పార్ట్లో సత్యం రాజేష్ బతికున్నట్లుగానే చూపించి ట్విస్ట్ ఇచ్చి సినిమాను ఎండ్ చేశారు. ఆ క్యారెక్టర్కు కొనసాగింపుగానే సీక్వెల్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో నత్తితో బాధపడే నిజాయితీపరుడైన కానిస్టేబుల్గా బాలాదిత్య కనిపించాడు. పాజిటివ్గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ను సత్యం రాజేష్ చేశాడు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఫస్ట్ పార్ట్ రిలీజైంది. సీక్వెల్ కూడా డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
టాపిక్