TS Lok Sabha Elections : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule) విడుదలైంది. ఉపఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి(TS Byelection) ఉపఎన్నికల తో సహా 17 లోక్ సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ కారణంగా ఇక్కడ ఉపఎన్నిక నిర్వహణకు ఈసీఐ (ECI)షెడ్యూల్ ప్రకటించింది. నాలుగే షెడ్యూల్ లో తెలంగాణలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
సంబంధిత కథనం