AP SSC Exams : ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో అప్డేట్ - వివరాల సవరణకు అవకాశం..! ఇలా చేయండి-ap government orders to correct mistakes in registration of details of ssc students ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Ssc Exams : ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో అప్డేట్ - వివరాల సవరణకు అవకాశం..! ఇలా చేయండి

AP SSC Exams : ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో అప్డేట్ - వివరాల సవరణకు అవకాశం..! ఇలా చేయండి

AP SSC Exams 2025 :ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. వివరాల నమోదులో తప్పుల సవరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పులు నమోదు చేసి ఉంటే డిసెంబర్ 23వ తేదీలోపు సరి చేసుకోవాలని సూచించింది. మరోవైపు ఏపీలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఏపీ టెన్త్ విద్యార్థులకు ముఖ్య అప్డేట్

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. పేర్ల నమోదుతో పాటు ఇతర వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఇందుకు డిసెంబర్ 23వ తేదీని తుది గడువుగా పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

వచ్చే మార్చిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫీజులను కూడా స్వీకరించింది. గడువుగా కూడా పూర్తి అయింది. విద్యార్థుల వివరాలన్ని కూడా ఆన్ లైన్ చేశారు. అయితే విద్యార్థి పేరులోనే కాని పుట్టిన తేదీ వివరాలు, చదివే మీడియం, తల్లిదండ్రుల పేర్ల విషయంలో ఏమైనా తప్పులు ఉన్నట్లు అయితే సవరణ చేసుకోవాలని పరీక్షల విభాగం సూచించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఆన్ లైన్ లో ప్రధానోపాధ్యాయుడు సరి చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించింది.

ఏపీ టెన్త్ పరీక్షలు - షెడ్యూల్ ఇదే

వచ్చే ఏడాది మార్చి 17 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఏపీ విద్యాశాఖ ఇటీవలనే విడుదల చేసింది.

  1. మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్
  2. మార్చి 19-సెకండ్ లాంగ్వేజ్
  3. మార్చి 21- ఇంగ్లీష్
  4. మార్చి 24 -గణితం
  5. మార్చి 26- ఫిజిక్స్
  6. మార్చి 28 - బయోలజీ
  7. మార్చి 31 - సోషల్ స్టడీస్

మరోవైపు ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. 2025 పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు మార్చి 20వ తేదీతో పూర్తి కానున్నాయి.