Gold and silver prices today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు మాత్రం పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి రూ. 62,740గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 62,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,27,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,274గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.10 తగ్గి రూ. 68,440కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 68,450గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,84,400గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 62,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,590గా ఉంది. ఇక కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 62,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 68,440గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,690గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,480గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 62,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 68,440గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,440గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,790గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 68,490గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 62,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,440గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేటు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సోమవారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,790గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 77,900గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 78,000గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 80,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 77,900.. బెంగళూరులో రూ. 76,900గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 90 పెరిగి రూ. 24,420కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 24,330గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం