Road Accidents in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో ఒకే చోట మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొదటి ప్రమాదం జరిగిన తరువాత… ఆ ప్రమాదాన్ని చూడటానికి వెళ్లిన ఇద్దరు తండ్రి కొడుకులు మృతి చెందారు. ఈ ప్రమాదాలు ఒకే చోట ఒకదాని తరువాత ఒకటి చోటు జరిగాయి.
ఈ రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో జరిగింది. ఒకే ప్రదేశంలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఐతవరంలో 65 నంబర్ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లోడుతో ఉన్న లారీని అటుగా వస్తున్న మరొక లారీ ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి చూడటానికి తండ్రి కొడుకులు వెళ్లారు. వారిపైకి ఇంకో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ అదే గ్రామానికి (ఐతవరం) సంకు మధవరావు, రామరాజుగా గుర్తించారు.
ఈ మూడు లారీలు ఢీకొట్టి ప్రమాదం జరిగిన ప్రదేశంలో కంటైనర్ డ్రైవర్ కంగారు పడి అతి వేగంగా కంటైనర్ ను మలుపు తిప్పడంతో… అదుపుతప్పి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ఇలా మూడో ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం వెళ్తున్న బస్సులో 30 మంది ప్రమాణికులు సురక్షితంగా బయటపడ్డారు.ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ ప్రమాదాలు గురించి సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేశారు.