Yadadri Collectorate : ఏవో, ఏఈవో మధ్య రిలేషన్…! యాదాద్రి కలెక్టరేట్ లో కత్తిపోట్ల కలకలం
11 November 2023, 12:49 IST
- Yadadri Bhuvanagiri District Crime News : యాదాద్రి కలెక్టరేట్ కార్యాలయంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఏఈవో మనోజ్పై ఏవో శిల్ప కతితో దాడికి దిగింది. మనోజ్కు మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో కత్తి పొట్ల కలకలం
Yadadri Bhuvanagiri District : భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో శుక్రవారం కత్తి పొట్లు కలకలం సృష్టించాయి.విధుల్లో ఉన్న ఓ మహిళా ఉద్యోగిని కత్తితో మరో సహోద్యోగిపై కత్తితో దాడి చేసింది.ఈ దాడిలో ఆ ఉద్యోగి మెడ,వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.దాడికి గల కారణాలు ఇలా ఉన్నాయి.
ప్రియుడితో అక్రమ సంబంధం....చివరకు!
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో నర్ర శిల్ప అగ్రికల్చర్ ఆఫీసర్ గా పని చేస్తుంది.శిల్ప కు 2012 లో సుధీర్ అనే వ్యక్తితో వివాహం కాగా వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు.కాగా గత రెండేళ్లుగా శిల్ప భర్త సుధీర్ కు దూరంగా ఉంటుంది.అయితే కావిడ్ సమయంలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగం చేసే మనోజ్ అనే వ్యక్తితో శిల్ప కు పరిచయం అయి ఇద్దరి మధ్య శారీరిక సంబంధం ఏర్పడింది.ఆ సమయంలోనే శిల్ప గర్భం దాల్చడంతో ఆమె గర్బ నివారణ మందులు తీసుకుంది. అయితే ఈ వ్యవహారమంతా భర్త సుధీర్ కు తెలవడంతో పలు మార్లు మందలించాడు. ఈ విషయమంతా కలక్టరేట్ లో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కొన్ని నెలల పాటు వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. అప్పుడు కూడా వీరి మధ్య శారీరిక సంబంధం అలానే కొనసాగింది. తద్వారా మళ్ళీ శిల్ప గర్భం దాల్చడంతో వైద్యుల సహకారంతో గర్భాన్ని నిర్వీర్యం చేసుకుంది. మళ్ళీ ఈ విషయమంతా భర్త సుధీర్ చేవున పడడంతో భార్య శిల్ప కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇటు శిల్ప సైతం భర్త సుధీర్ కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అయింది. ప్రియుడు మనోజ్ కూడా విడాకులు ఇచ్చి తనతో రమ్మని చెప్పాడు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు శిల్ప,మనోజ్ ల మధ్య చిన్న చిన్న ఘర్షణలు ఏర్పడ్డాయి. ప్రియుడు మనోజ్ రెండు నెలల పాటు ఉద్యోగానికి లీవ్ పెట్టి కనిపించకుండా పోయి తిరిగి శుక్రవారం ఆఫీస్ కు రావడంతో ఇన్ని రోజులు తీవ్ర మనస్థాపం చెందిన శిల్ప మనోజ్ ను ఎక్కడికి వెల్లావని నిలదీసింది.ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా తీవ్ర ఆగ్రహంతో శిల్ప కత్తితో మనోజ్ మెడ,వీపు భాగంలో దాడి చేసింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.స్పందించిన తోటి ఉద్యోగులు మనోజ్ ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు మహిళపై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.