తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Girl Murder Case | వికారాబాద్ బాలిక హత్య కేసులో ఏం జరుగుతోంది.. ట్విస్టుల మీద ట్విస్టులు.. నిందితులెవరు?

Girl Murder Case | వికారాబాద్ బాలిక హత్య కేసులో ఏం జరుగుతోంది.. ట్విస్టుల మీద ట్విస్టులు.. నిందితులెవరు?

HT Telugu Desk HT Telugu

29 March 2022, 11:11 IST

    • వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసులో.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నిందితులు ఎవరు అనే దానిపైనా సరిగా స్పష్టత లేకుండా పోయింది. దీంతో కీలక ఆధారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభాకర్ అనే వ్యక్తే.. దీనికి కారణామా? లేకుంటే మరెవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
వికారాబాద్ బాలిక హత్య కేసు
వికారాబాద్ బాలిక హత్య కేసు

వికారాబాద్ బాలిక హత్య కేసు

వికారాబాద్ జిల్లాలో బాలిక హత్యకేసులో.. పెద్ద స్కెచ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయం బయటకు వెళ్లిన.. బాలిక ఆ తర్వాత తిరిగి రాలేదు. చెట్ల పొదల్లో శవమై కనిపించింది. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

బాలికను అత్యాచారం చేసి.. హత్య చేయాలని పథకం ప్రకారమే జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిని ఒంటరిగా పిలిపించి.. ఆ తర్వాత.. హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అందులో.. మహేందర్ అనే వ్యక్తి.. హత్య జరిగిన ప్రదేశానికి ఇంటి దగ్గరలోనే ఇంటి నిర్మాణం చేశాడు. ఆదివారం రాత్రి.. స్నేహితులకు పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. సోమవారం తెల్లవారి.. బాలికను ఒంటరిగా పిలిపించాడనే ప్రచారం జరుగుతోంది.

అయితే.. ఒంటరిగా వచ్చిన బాలికపై.. ఒకరే అత్యాచారం చేశారా? లేదంటే సామూహిక అత్యాచారం జరిగిందా? అసలు ఎవరు.. ఎందుకు చంపారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

హత్య కేసులో మరో ట్విస్ట్!

ఇదిలా ఉంటే.. ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చి పడింది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. బాలికను తల్లే చంపినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో బాలిక తల్లిని పోలీసులు ప్రశ్నించారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతోంది. దీంతో.. తల్లి లక్ష్మి దేవినీ సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒకవేళ బాలికను ఇంట్లోనే హత్య చేసి... బయటకు తీసుకొచ్చి పడేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. నిందితుడిగా భావిస్తున్న మహేందర్ ఆ సమయంలో బాలికను కలిసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. ఏవైనా.. ఆధారాలు దొరికితే.. ఎవరు హత్య చేశారనే.. విషయం బయటకు రానుంది. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం