తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Orphan Girls Raped : అనాథ బాలికలపై అత్యాచారం.. మసాజ్ చేయాలంటూ వార్నింగ్!

Orphan Girls Raped : అనాథ బాలికలపై అత్యాచారం.. మసాజ్ చేయాలంటూ వార్నింగ్!

HT Telugu Desk HT Telugu

26 October 2022, 13:03 IST

    • Hyderabad Crime News : భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. అనాథ బాలికల స్థితిని ఓ వ్యక్తి ఆసరాగా చేసుకున్నాడు. వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనాథ బాలికలపై అత్యాచారం
అనాథ బాలికలపై అత్యాచారం (HT_PRINT)

అనాథ బాలికలపై అత్యాచారం

హైదరాబాద్(Hyderabad)లో దారుణం జరిగింది. నేరేడ్‌మెట్‌లోని చిల్డ్రన్ హోమ్ లో ఆశ్రయం ఉంటున్న ఇద్దరు అనాథ బాలికలపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అతడే చిల్డ్రన్ హోమ్ ను నిర్వహిస్తున్నాడు. మెుత్తం ముగ్గురు కాగా.. అందులో ఒకరు ఈ దారుణం చేశాడు. బాలికలు బయటకు చెప్పడంతో విషయం తెలిసింది. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ నెల 19వ తేదీన సఖి కేంద్రం అధికారులకు బాలికలు తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. బాధితుల నుంచి పోలీసులు(Police) ఫిర్యాదు తీసుకున్నారు. చిల్డ్రన్ హోమ్ నడిపిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మురళిపై పోక్సోతోపాటుగా ఇతర కేసులు నమోదు చేశారు. మరోవైపు నిర్వాహకులైన విక్టర్, అతడి భార్యపై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది.

విషయం బయటకు వచ్చింది ఇలా..

నేరేడ్‌మెట్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో ఓ ప్రైవేటు చిల్డ్రన్‌ హోం ఉంది. పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వారు చాలామందే ఉన్నారు. ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే మెుత్తం నలుగురు ఈ హోం నుంచి బయటకు వచ్చారు. ఇందులో ఓ మేజర్, మిగిలిన ముగ్గురు బాలికలు. మేజర్‌, మరో బాలిక కలిసి సంగారెడ్డి(Sangareddy)లో తెలిసిన వారి ఇంటికి వెళ్లిపోయారు.

మిగిలిన ఇద్దరు బాలికలు సికింద్రాబాద్ లో ఉన్నారు. ఎవరూ తెలిసిన వారు లేరు. దీంతో చేసేదేమీ లేక చిల్డ్రన్ హోమ్(Children Home)కు మళ్లీ చేరుకున్నారు. బాలికలు పారిపోయిన విషయం మహిళా శిశు సంక్షేమశాఖ, సఖి కేంద్రానికి తెలిసింది. అధికారులు వారితో మాట్లాడారు. ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఏదైనా సమస్యలు ఉండే చెప్పాలని అడిగారు. మాపై అత్యాచారం(Rape) జరుగుతుందని బాలికలు ఇద్దరూ చెప్పారు. ఒకరిపై హోమ్ లో మరొకరిపై బయట ఇంకో ప్రాంతంలో అత్యాచారం జరిగిందని తెలిపారు. సంగారెడ్డిలో ఉన్న వారిని కూడా పోలీసులు హైదరాబాద్‌(Hyderabad)కు తీసుకొచ్చారు.

అయితే.. పోలీసులు దర్యాప్తు చేస్తుంటే.. విస్తూపోయే విషయాలు తెలుస్తున్నట్టుగా సమాచారం. ప్రధాన నిందితుడు మురళి.. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, కాళ్లు పట్టించుకోవడం, మసాజ్(Masaz) చేయించుకోవడం లాంటివి చేసేవాడని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు రహస్యంగా ఉంచుతున్నట్టుగా సమాచారం. మరోవైపు మహిళాశిశు సంక్షేమశాఖ ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉంది. బాలికలను ప్రస్తుతం వేరే వసతి గృహానికి తరలించారు.

తదుపరి వ్యాసం