తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Special Trains: నాందేడ్ - తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains: నాందేడ్ - తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

05 August 2022, 16:48 IST

    • south central railway special trains: తిరుపతి నుంచి నాందేడ్, వికారాబాద్ కు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

special trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికే పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకురాగా... తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

nanded to tirupati special trains: నాందేడ్ - తిరుపతి (07651) ట్రైన్ సోమవారం బయల్దేరుతుంది. రాత్రి 10.45 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 07.15 నిమిషాలకు చేరుకుంటుంది. తిరుపతి - వికారాబాద్ (07652) మధ్య మంగళవారం ప్రత్యేక ట్రైన్ బయల్దేరనుంది. తిరుపతి నుంచి రాత్రి 10. 20 గంటలకు బయల్దేరి... మరునాడు 12.45 నిమిషాలకు వికారాబాద్ చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు ఇవే...

తిరుపతి - వికారాబాద్ వెళ్లే ట్రైన్.... రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికూడ, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ , లింగపల్లి స్టేషన్లల్లో ఆగుతుంది. నాందేడ్ - తిరుపతి వెళ్లే స్పెషల్ ట్రైన్... ముదుఖేడ్, ధర్మాబాజ్, బాసర్, నిజామాబాజ్, కామారెడ్డి, అక్కన్నపేట్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్లు, సత్తెనపల్లి, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు నాందేడ్-హుబ్లీ (Hubballi) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 6వ తేదీన నడపనున్నారు. ఈ ట్రైన్ 14.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09 గంటలకు గమ్యానికి చేరుతుంది. హుబ్లీ(Hubballi)-నాందేడ్ ట్రైన్ ను ఈ నెల7 నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 11.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.10 గంటలకు గమ్యానికి చేరుతుంది. ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.

తదుపరి వ్యాసం