తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Kishan Reddy: ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామన్న కిషన్‌ రెడ్డి

BJP Kishan Reddy: ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామన్న కిషన్‌ రెడ్డి

HT Telugu Desk HT Telugu

30 August 2023, 9:41 IST

    • BJP Kishan Reddy:  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన  తమకు లేదన్నారు. 
ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన జేపీ నడ్డా
ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన జేపీ నడ్డా (Ishant )

ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన జేపీ నడ్డా

BJP Kishan Reddy: తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేసే వారి జాబితాను కుటుంబ పార్టీల తరహాలో నిర్ణయించలేమన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బిఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీ అని డైనింగ్‌ టేబుల్ మీద అభ్యర్థుల భవితవ్యాన్ని తాము నిర్ణయించలేమని చెప్పారు. పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఎన్నికల కమిటీ వేశామని, ఆ కమిటీ సమావేశమైన తర్వాత అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామి చెప్పారు.

తెలంగాణలో సెప్టెంబరు 17న రాష్ట్ర విమోచన దినోత్సవం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులతో వివిధ రకాల యాత్రలు చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యాత్రల్లో శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలిసి అన్ని విషయాలపై చర్చిస్తామని చెప్పారు.

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ విషయంలో అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. ప్రధాని పిలుపు మేరకు పెట్రోల్‌పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం పన్నులు తగ్గించకుండా ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు.

ఇప్పట్లో జాబితా లేనట్టే….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆగష్టు చివరికి ప్రకటించాలని భావించినా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తే ముఖ్య నాయకులు తమ నియోజక వర్గాలకే పరిమితం అవుతారని బీజేపీ ఆలోచిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలు మినహా మిగిలిన చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ వడపోత ప్రారంభించింది. బీజేపీ ఇప్పుడే జాబితా ప్రకటించకూడదని భావిస్తోంది. తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే నిర్దేశించింది.

తెలంగాణలో కీలకమైన నాయకులు 30మంది వరకు ఉన్నారు. నియోజక వర్గాల వారీగా అభ్యర్థిత్వాలను ఇప్పుడే ప్రకటిస్తే ఆ నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమైతే ఇతర ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కష్టమవుతుందని భావిస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉన్నందున ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఖర్చు పెరగడం వంటి సమస్యలు ఉంటాయని అంచనాకు వచ్చారు.

బిఆర్‌ఎస్‌ ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం ప్రత్యర్థులను ట్రాప్‌ చేయడానికేనని బీజేపీ భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ఖమ్మంలో పార్టీ నేతలతో సమావేశమైనపుడు తొందరపడి ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరంలేదని, పార్టీ నిర్దేశిత కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

సరైన సమయంలో బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని, అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. తెలంగాణలో 19 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలు, 12 ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. వీటిలో బలమైన అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా తగిన వారిని బరిలోకి దించాలని యోచిస్తోంది.

తెలంగాణలో గెలిచి తీరాలన్న నడ్డా….

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని అక్కడ గెలిచి తీరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ తొలిసారి ఈ భేటీకి హాజరయ్యారు.

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం ఎన్నికలపై చర్చించారు. దక్షిణాదిలో కర్ణాటకలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి రావడం పార్టీకి ఎంతో అవసరమని నడ్డా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో భాజపాకు అనుకూల వాతావరణం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుని గెలిచి తీరాలని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

తదుపరి వ్యాసం