Gang Rape Case : గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు.. మరో బాలికనూ..
06 June 2022, 16:27 IST
- హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమ్నీషియా పబ్ రేప్ కేసు రిమాండ్ రిపోర్టులో మరికొన్ని విషయాలు తెలిశాయి.
ప్రతీకాత్మక చిత్రం
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ లో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. తాజాగా రిమాండ్ రిపోర్టులో మరికొన్ని విషయాలు తెలిశాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించారు. కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా తెలుస్తోంది. సాదుద్దీన్ మాలిక్ అనే వ్యక్తితో కలిసి.. ఇద్దరు మైనర్ బాలికలకు వేధించారు. భరించలేక పబ్ నుంచి బయటకు వచ్చారు బాలికలు.
వెళ్లిపోతానని చెప్పింది
పబ్ నుంచి బయటకు వచ్చాక ఓ బాలిక నేరుగా క్యాబ్ తీసుకొని వెళ్లిపోయింది. బాలికల వెనకాలే సాదుద్దీన్ అండ్ గ్యాంగ్ బయటకు వచ్చింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను ట్రాప్ చేశాడు కార్పొరేటర్ కొడుకు. ఇంటి వద్ద దించుతామని గ్యాంగ్ అంతా కలిసి నమ్మించింది. ఓ మాజీ ఎమ్మెల్యే మనవడికి చెందిన బెంజ్ కారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణం మెుదలుపెట్టారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు వెళ్లారు. బెంజ్ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్య ప్రవర్తించింది. అరాచకాలు భరించలేక బేకరి దగ్గర వెళ్లిపోతానని బాధిత బాలిక వారితో చెప్పింది. మాయమాటలు చెప్పిన నిందితులు.. మళ్లీ మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకుని కొద్దిదూరం ప్రయాణం చేశారు.
ఎంజాయ్ చేశామని పోస్ట్
ఫోన్ కాల్తో ఎమ్మెల్యే కుమారుడు మధ్యలోనే దిగి వెళ్లిపోయాడు. బెంజ్ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ డ్రామాలు నిందితులు డ్రామాలు ఆడారు. వెనకాలే ఇన్నోవాలో వస్తున్న వక్ఫ్బోర్డు ఛైర్మన్ కుమారుడి వాహనంలోకి బాలికను తరలించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ తర్వాత బేకరికి చేరుకుని.. ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్స్టాలో పోస్టు పెట్టారు నిందితులు. అనంతరం బేకరి నుంచి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. విషయం బయటకు వచ్చి.. కేసు నమోదుకాగానే హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఇన్నోవా కారును వక్ఫ్బోర్డు చైర్మన్ ఫాంహౌస్లో దాచారు.
వీడియోలు షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్
మరోవైపు బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కూడా కేసు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వీడియోలను రఘునందన్ రావు ప్రెస్ మీట్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.
కేసు సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్
సామూహిక అత్యాచార ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. నివేదిక పరిశీలించాక తమ తరపున చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కారులో వీర్యం నమూనాలు
నిందితులు వాడిన కార్లలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేశారు. మెర్సిడిస్ బెంజి కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. బాధిత బాలిక జుట్టు, చెప్పు, కమ్మను క్లూస్ టీమ్ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక జుట్టుతో పాటు నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్టు తెలుస్తోంది. వాటిని సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు.
టాపిక్