Crime News | అల్లుడిని చంపిన మామ.. కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కారణామా?!
17 April 2022, 13:29 IST
- తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. అల్లుడిని మామ చంపినట్టుగా తెలుస్తోంది. భువనగిరికి చెందిన రామకృష్ణని మామ వెంకటేష్ పరువు కోసం హత్యమార్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
యాదగిరిగుట్ట చెందిన భార్గవి.., వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16న ప్రేమ వివాహం చేసుకున్నాడు. లింగరాజుపల్లిలో కాపురం పెట్టారు. భార్య భార్గవికి ప్రెగ్నెన్సీ రావడంతో.. భువనగిరి పట్టణానికి షిఫ్ట్ అయ్యారు. ఐదారు నెలల క్రితం.. వీరికి పాప జన్మించింది. ఈ మధ్య కాలంలోనే.. తుర్కపల్లి గుప్త నిధుల కేసులో.. రామకృష్ణ సస్పెన్షన్కు గురయ్యాడు.
అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ లో తిరుగుతున్నాడు. హైదరాబాద్ చెందిన లతీఫ్ అనే వ్యక్తి భూమి చూపిస్తానని చెప్పి.. ఏప్రిల్ 15న రామకృష్ణను హైదరాబాద్కు తీసుకునిపోయాడు. అప్పటి నుంచి.. రామకృష్ణ కనిపించడం లేదు. దీనిపై భార్య.. భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం అదృశ్యమైన రామకృష్ణ… శవమయ్యాడు. అతడి మృతదేహం.. తాజాగా సిద్దిపేట దగ్గర లభ్యమైంది. మరోవైపు పోలీసుల విచారణలో భాగంగా రామకృష్ణను కావాలనే హత్య చేసినట్టుగా గుర్తించారు. రామకృష్ణ తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని తమకు దూరం చేశాడని.. మామ కోపం ఉన్నట్టు తేలింది. అందులో భాగంగానే.. కోపంతోనే అల్లుడిని చంపించినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది.
రామకృష్ణ రియల్ ఎస్టెట్ లో ఉన్నాడని తెలిసి.. ప్లాన్ ప్రకారమే చంపించారని తెలుస్తోంది. ఈనెల 15న రామకృష్ణను భూమి చూపిస్తానని చెప్పి.. హైదరాబాద్ కు చెందిన లతీఫ్ పిలిచాడు. భువనగిరి నుంచి తీసుకెళ్లి.. నిందితులు రామకృష్ణను చంపేసి.. సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పడేసినట్టుగా అనుమానిస్తున్నారు. భార్గవి తండ్రి వెంకటేశ్, ఓ వీఆర్వో, లతీఫ్ అనే రౌడీ షీటర్తో పాటు మరి కొందరి హస్తం ఉన్నట్లుగా అనుకుంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం.. రామకృష్ణ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
టాపిక్