Crime News : ఉరేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
04 August 2022, 10:53 IST
- సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలని పోలీసులు వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
టాపిక్