తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వరలక్ష్మీ వ్రత విధానం.. చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే

వరలక్ష్మీ వ్రత విధానం.. చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే

HT Telugu Desk HT Telugu

24 August 2023, 20:44 IST

    • శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతానికి - వరలక్ష్మీ పూజకు చాల ప్రత్యేకత ఉన్నది. ఈ సంవత్సరం 2023 అగస్టు 25 శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచారించాలని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. హిందూస్తాన్‌ టైమ్స్‌ పాఠకుల కోసం వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా అందిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రత విధానం
వరలక్ష్మీ వ్రత విధానం

వరలక్ష్మీ వ్రత విధానం

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకుల కోసం వరలక్ష్మీ వ్రత విధానం అందించారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి:

పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూల దండలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరములు, అగరవత్తులు, కర్పూరము, నాణాలు, ఒక తెల్ల టవల్‌, జాకెట్‌ ముక్కలు, ఎర్రటి రవికె వస్త్రం, మామిడి ఆకులు , ఒక డజన్‌ అరటిపండ్లు, ఇతర ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫొటో, కలశం, కొబ్బరి కాయలు, తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం, స్వీట్లు, బియ్యం, కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, బియ్యం, శనగలు (నానబెట్టినవి) మొదలైనవి.

వరలక్ష్మీ వ్రత విధానం:

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మ వారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.

కంకణం ఎలా తయారు చేసుకోవాలి:

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో, ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి.

గణపతి పూజ:

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్ధం

గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ

కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో

సర్వ కార్యేషు సర్వదా

ఆగచ్చ వరసిద్ధ వినాయక

అంబికా ప్రియనందన

పూజాగ్భహాణ సుముఖ

నమస్తే గణనాయక అంటూ గణపతిపై అక్షతలు చల్లాలి.

యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం గజకర్ణికాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం వికటాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గణాధిపాయ నమః

ఓం ధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గజాననాయ నమః

ఓం శూర్చకర్ణాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం స్కంద పూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

ధూపం అఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

దీపం దర్శయామి

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ...

సత్యం త్వర్తేన పరిషించామి

అమృతమస్తు, అమృతోపస్తరణమసి..

ఓం ప్రాణాయ స్వాహా

ఓం ఆపానాయ స్వాహా

ఓం వ్యానాయస్వాహా

ఓం ఉదానాయ స్వాహా

ఓం సమానాయ స్వాహా

ఫల నివేదనం సమర్పయామి

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి)

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

తాంబూలం సమర్పయామి

తాంబూలానంతరం అచమనంసమర్పయామి.

(కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

కర్పూర నీరాజనం సమర్పయామి

నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!

అనేన మాయా చరిత గణపతి

అర్చనేన భగవతః సర్వాత్మకః

శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు

మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు

వినాయకునికి నమస్కరించి పూజ

చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.

ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాథ్రితాః

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ:

స్థితాః కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

బుగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః

అంగ్కెశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాథితాః

ఆయాంతు గణపతి పూజార్ధం దురితక్షయకారకాః

గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే

సింధూ కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడి పైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ:

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి

ఓం చపలాయై నమః జానునీ పూజయామి

ఓం పీతాంబరాయై నమః ఊరూం పూజయామి

ఓం కమలవాసిన్వ్యై నమః కటిం పూజయామి

ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి

ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి

ఓం కంబు కంఠ్షై నమః కంఠం పూజయామి

ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి

ఓం సునేత్రాయ నమః నేత్రా పూజయామి

ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి

ఓం కమలాయై నమః శిరః పూజయామి

ఓం వరలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహిత ప్రదాయై నమః

ఓం తద్ధాడై నమః

ఓం సురభ్య్యై నమః

ఓం పరమాత్నికాయై నమః

ఓం వాచై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం పద్మాయె నమః

ఓం శుచయే నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః

ఓం అదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిత్య్రై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసంభవాయైనమః

ఓంఅనుగ్రహప్రదాయైనమః

ఓం బుద్ధయే నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోకవినాశిన్యైనమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్యాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోదృవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయైనమః

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయైనమః

ఓం దేవ్యై నమః

ఓం పద్నిన్యై నమః

ఓం పద్మగందిన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాఖిముఖై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యైనమః

ఓం చతుర్చుజాయై నమః

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్ష్హాదజనన్తవై నమః

ఓం పుష్టె నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం తుష్టయై నమః

ఓం దారిద్రనాశిన్యై నమః

ఓం ప్రీతిష్మరితై శ్రీ నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్షమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్మ్యై నమః

ఓం వబిల్వనిలయాయైనమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్వై నమః

ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిత్ష్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధయై నమః

ఓం త్రైణ్యసామ్యాయనమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్శగతానందాయ నమః

ఓం వరలక్ష్మై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయైనమః

ఓం జయాయై నమః

ఓం మంగళాదేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థలాయైనమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః

ఓం నారాయణ సమాథ్రితాయై నమః

ఓం దారిద్య్ర ధ్వంసిన్యైనమః

ఓం దేవ్యై నమః

ఓం సర్వోపద్రవనివారిత్రై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్య్యై నమః

ఓం వరలక్ష్యై నమః

కంకణపూజ

కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి

ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి

ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి

ఓం విశ్వజనన్వ్యై నమః చతుర్ధ గ్రంథిం పూజయామి

ఓం వరలక్ష్మై నమః వంచమ గ్రంథిం పూజయామి

ఓం క్షీరాబ్ది తనయాయె నమః షష్టమ గ్రంథిం పూజయామి

ఓం విశ్వసాక్షిజ్యి నమః సప్తమ గ్రంథిం పూజయామి

ఓం చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి

ఓం వరలక్ష్మ్యై నమః నవమ గ్రంధిం పూజయామి.

ఈ క్రింది శ్లోకాలు చదువుతూ కంకణ కట్టుకోవాలి.

“బద్నామి దక్షిశేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే”

వ్రత కథా ప్రారంభం:

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి చిలకమర్తి తెలిపారు.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.

అప్పుడు పార్వతీదేవి... దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. అప్పుడు శివుడు చెప్పనారంభించాడు.

కాత్యాయనీ... పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం: వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్మరించింది. ఓ చారుమతీ... ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్జానమైంది. చారుమతి సంతోషించి హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్షీదేవిని స్తుతించింది.

చారుమతి మేల్మొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్చ విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.

శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్ననూ, ఈ వ్రతం చేసిననూ ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, అయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్ధప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్ధ ప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి, రాత్రి ఉపవాసం ఉండాలి.

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం