Stock market | ఈ స్టాక్స్ మీ దగ్గరుంటే.. స్వల్పకాలంలో భారీ లాభాలే..!
24 April 2022, 13:45 IST
- ఆటో రంగంలోని స్టాక్స్కు స్వల్పకాలంలో మంచి లాభాలు వస్తాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు గల కారణాలను వివరిస్తున్నారు. అవేంటంటే..
స్టాక్ మార్కెట్ ఇండియా
Auto sector stocks | కొవిడ్ కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఆటో సెక్టార్ ఒకటి. అందుకు తగ్గట్టుగానే స్టాక్ మార్కెట్లో ఆటో సెక్టార్ షేర్లు పెద్దగా రాణించలేదు. స్టాక్ మార్కెట్ పెరిగినా.. ఈ రంగం మాత్రం వెనకంజలోనే ఉండిపోయింది. అయితే.. ఆటో సెక్టార్కు ఇప్పుడు టైమ్ వచ్చిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
శుక్రవారం సెషన్లో.. నిఫ్టీ ఆటో 11,000 వద్ద బ్రేకవుట్ ఇచ్చింది. ఫలితంగా ఆటో రంగంపై మార్కెట్ వర్గాల్లో బుల్లిష్ అభిప్రాయం ఏర్పడింది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో.. నిఫ్టీ ఆటో.. 11వేల మార్కు దాటి ఓపెన్ అయ్యి.. వారం చివర్లో 11,100 మార్కును అందుకోగలిగితే.. ఆటో షేర్లకు పండగే అని భావిస్తున్నారు. మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ను ఎంచుకుంటే స్వల్ప కాలంలోనే మంచి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.
ఎం అండ్ ఎం బెస్ట్…!
అయితే ఈ విషయంపై మరికొంత స్పష్టత వచ్చేంతవరకు వేచిచూడాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎం ఆండ్ ఎం, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్ వంటి షేర్లు బై కాల్ ఇస్తున్నారు.
"గురువారం.. నిఫ్టీ ఆటో 11వేల మార్కును అందుకుంది. కానీ ఎక్కువసేపు ఉండలేక 11వేల దిగువకు పడిపోయింది. శుక్రవారం సెషన్లో కూడా ఇదే జరిగింది. 11వేల మార్కును అందుకుంది. బ్రేక్అవుట్ లెవల్ బయటే ముగిసింది. సోమవారం 11వేలు దాటితే.. ఆటో స్టాక్స్ కొనుకొవచ్చు," అని చాయిస్ బ్రోకింగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా వెల్లడించారు.
"2022 నాలుగో త్రైమాసికంలో ఆటో సంస్థలు వాహనాల ధరలు పెంచాయి. ముడిసరకు ధరలు పెరిగాయని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్- జూన్ త్రైమాసికం ఫలితాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది. వాహనాల అమ్మకాలు పడిపోకపోతే.. మంచి ఫలితాలే వెలువడే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్ నాలుగో వేవ్ రాకపోయినా.. ఆటో సెక్టార్కు మంచిదే. సెమీకండక్టర్ సమస్యలు పరిష్కారమైతే ఆటో రంగానికి ఇంకా మంచిది. మార్జిన్లు పెరుగుతాయి. అందువల్ల స్పల్పకాలంలో ఆటో సెక్టార్ షేర్లు పెరిగే అవకాశం ఉంది," అని ప్రాఫిట్మార్ట్ సెక్యూరిటీస్ సంస్థ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ పేర్కొన్నారు.
ఎం అండ్ ఎం షేర్లు కొనుగోలు చేస్తే మంచిదని అవినాష్ అభిప్రాయపడ్డారు.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రాసిన కథనం మాత్రమే. ఇందులోని అభిప్రాయాలు కేవలం వ్యక్తిగతం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. పెట్టుబడులు పెట్టే ముందు.. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కర్.
టాపిక్