Republic day 2024 live updates : కర్తవ్య పథ్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..
26 January 2024, 12:44 IST
- Republic day 2024 live updates : దేశ ప్రజలకు 75వ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో.. దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకల లైవ్ అప్డేట్స్ కోసం ఈ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు బ్లాగ్ని ఫాలో అవ్వండి..
రిపబ్లిక్ డే పరేడ్ ముగింపు..
దిల్లీ కర్తవ్య పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ముగిసింది. రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్లు రాష్ట్రపతి భవన్కు బయలుదేరారు.
రఫేల్ విన్యాసాలు..
కర్తవ్య పథ్పై మారుత్ ఫార్మేషన్లో ఆరు రఫేల్ జెట్లు దూసుకెళ్లాయి. ఆ దృశ్యాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి.
శకటాల ప్రదర్శన..
ఆర్మీ మార్చ్ ముగిసింది. వివిధ రాష్ట్రాల శకటాలను కర్తవ్య పథ్లో ప్రదర్శిస్తున్నారు.
భారత శక్తి ఇది..
దిల్లీ కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ అట్టహాసంగా జరుగుతోంది. బీఎస్ఎఫ్, వాయుసేన మొదలైన భద్రతా దళాలు తమ శక్తి సామర్థ్యాన్ని చాటి చెప్పాయి.
కర్తవ్య పథ్లో నారీ శక్తి..
కర్తవ్య పథ్లో నారీశక్తి ఆవిష్కృతమైంది. ట్రై- సర్వీస్లకు చెందిన మహిళా సైనికులు.. కర్తవ్య పథ్లో మార్చ్ నిర్వహించారు. ఇది జరగడం చరిత్రలో తొలిసారి!
భారత సైన్యం శక్తి..
కర్తవ్య పథ్లో భారత సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నారు. రాకెట్లు, యుద్ధ ట్యాంకర్లును సైన్యం ప్రదర్శిస్తోంది.
రిపబ్లిక్ డే పరేడ్..
కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే వేడుకలు మొదలయ్యాయి. పరేడ్ ప్రారంభమైంది.
కర్తవ్యపథ్లో ఈవెంట్ మొదలు..
కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు మోదీ స్వాగతం పలికారు.
కర్తవ్య పథ్కు రాష్ట్రపతి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్లు.. కర్తవ్యపథ్కు బయలుదేరారు.
75ఏళ్లల్లో తొలిసారి..
ఛత్తీస్గఢ్ బస్తర్లో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. నక్సల్ ప్రభావితమైన బస్తర్లోని గ్రామాల్లో 75ఏళ్లల్లో తొలిసారిగా గణతంత్ర్య వేడుకలు జరుగుతుండటం విశేషం.
నేషనల్ వార్ మెమోరియల్లో మోదీ..
రిపబ్లిక్ డే సందర్భంగా.. ప్రధాని మోదీ.. నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లారు. అమర వీరులకు నివాళులర్పించారు. ఇంకొద్ది సేపట్లో ఎర్రకోటకు వెళతారు.
రష్యా విషెస్..
దేశ ప్రజలు రష్యా.. వినూత్నంగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపింది. దిల్లీలోని రష్యా ఎంబసీ ఉద్యోగులు.. గదార్ సినిమా పాటకు నృత్యాలు చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడి కీలక ప్రకటన..
రిపబ్లిక్ డేకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్.. కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్లో భారత విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా పలు కీలక చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వీసా విషయంలోనూ ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు.
లక్నోోలో..
ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పారు.
తమిళనాడులో..
తమిళనాడులో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ రవి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం స్టాలిన్ కూడా పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్స్లో..
పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్న వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులర్పించారు.
ప్రధాని మోదీ ట్వీట్..
దేశ ప్రజలకు గణతంత్ర్యి దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్ చేశారు.
రిపబ్లిక్ డే పరేడ్..
రిపబ్లిక్ డే పరేడ్ని చూసేందుకు ప్రజలు ఇప్పటికే కర్తవ్య పాత్కు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈవెంట్ మొదలయ్యే సమయానికి.. రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
దిల్లీలో పొగమంచు..
దిల్లీపై కోల్డ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. రిపబ్లిక్ డే రోజు ఉదయం సైతం.. చలికి గడగడలాడిపోతోంది. ప్రజలు రోడ్లపై చలి కాచుకునేందుకు మంటలు వెలిగించుకుంటున్నారు.
షెడ్యూల్ ఇదీ..
ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిపబ్లిక్ డే పరేడ్ మొదలవుతుంది. దాని కన్నా ముందు.. ప్రధాని మోదీ.. నేషనల్ వార్ మెమోరియల్ని సందర్శించనున్నారు.
ఇండియాకు అమెరికా శుభాకాంక్షలు..
భారత్కు గణతంత్ర్యి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది అమెరికా. ఇండియా తమకు వ్యూహాత్మక భాగస్వామి అని పునరుద్ఘటించింది.
గత రిపబ్లిక్ డేలకు వచ్చిన ముఖ్య అతిథులు
ప్రతీ సంవత్సరం మన గణతంత్ర వేడుకలకు మిత్ర దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా పిలవడం ఆవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగే 75వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. గత రిపబ్లిక్ డే లకు వచ్చిన ముఖ్య అతిథుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
పద్మ అవార్డులు విడుదల..
75వ గణతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. పద్మ అవార్డులను విడుదల చేసింది కేేంద్రం. 132 మందికి 'పద్మ' పురస్కారాలు లభించాయి. చిరంజీవి, వెంకయ్యకు పద్మవిభూషణ్ వరించింది. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రిపబ్లిక్ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటాము?
జనవరి 26న, భారత రాజ్యంగం అమల్లోకి రావడంతో రిపబ్లిక్ డేని జరుపుకుంటాము. కానీ.. జనవరి 26నే ఎందుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది? జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గణతంత్ర్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము?
1950 జనవరి 26 నుంచి భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆరోజు నుంచి రిపబ్లిక్ డే నాడు ప్రతి చోట సగౌరవంగా మువ్వన్నల జెండాను ఎగరవేస్తూ ఉంటాము.
దేశవ్యాప్తంగా..
దేశవ్యాప్తంగా.. రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దిపాలతో వెలిగిపోతున్నాయి.
దిల్లీ మెట్రో..
గణతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. దిల్లీ మెట్రో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకే ఓపెన్ అయ్యింది. దాదాపు ప్రతి మెట్రో స్టేషన్ వద్ద పోలీసు బలగాలు కనిపిస్తున్నాయి.
ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..
ఈ దఫా రిపబ్లిక్ డే 2024 పరేడ్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా ఉండనున్నారు. ఆయన గురువారమే ఇండియాకు చేరుకున్నారు.
భద్రతా వలయంలో దిల్లీ..
రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దిల్లీ మహానగరం.. భద్రతా వలయంలోకి జారుకుంది. ఎలాటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
75వ గణతంత్ర్య దినోత్సవం..
75వ రిపబ్లిక్ డే వేడుకల కోసం దేశం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో.. దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై.. మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది.