India Covid Cases: లక్షకు చేరువలో కరోనా యాక్టివ్ కేసులు
21 August 2022, 13:09 IST
Corona cases in India: దేశంలో కొత్తగా 11,539 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 43 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు
Today India Corona Cases: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 11,539 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్ బారిన పడి మరో 43 మంది మృతి చెందారు.
కొత్త కేసులు - 11,539
మరణాలు - 43
రికవరీ రేటు - 98.59 శాతం
యాక్టివ్ కేసుల శాతం - 0.23 శాతం
ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులు - 99,879
మొత్తం కేసులు: 44,339,429
దేశంలో ఇప్పటి వరకు మొత్తం మరణాలు - 5,27,332
డైలీ పాజిటివిటీ రేటు - 3.75 శాతం
దేశంలో శనివారం 26,58,755 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,09,67,06,895కు చేరింది. ఒక్కరోజే 3,07,680 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఇక కరోనా వైరస్ మరణాలు... అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ నుంచి ఉన్నాయి.
తెలంగాణలో శనివారం కొత్తగా 357 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 440 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.24 లక్షలకు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 2711 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
టాపిక్