Chiranjeevi: సన్నాఫ్ ఇండియా డైరెక్టర్కు చిరంజీవి ఛాన్స్ ఇస్తాడా?
18 May 2023, 6:53 IST
Chiranjeevi: సన్నాఫ్ ఇండియా దర్శకుడు డైమండ్ రత్నబాబుతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి
Chiranjeevi: వాల్తేర్ వీరయ్య సినిమాతో సంక్రాంతి విన్నర్గా నిలిచాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మాస్ క్యారెక్టర్లో చిరంజీవి యాక్టింగ్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకొన్నాయి. ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి కొత్త కథలను వింటోన్నారు.
సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కల్యాణ్ కృష్ణ, బింబిసార దర్శకుడు వశిష్టలతో చిరంజీవి సినిమాలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి తాను ఓ కథను వినిపించినట్లు సన్నాఫ్ ఇండియా దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పారు.
డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న అన్స్టాపబుల్ మూవీ జూన్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి కథ చెప్పన విషయాన్ని డైమండ్ రత్నబాబు రివీల్ చేశాడు.
తాను చెప్పిన కథ విని చిరంజీవి ప్రశంసించారని, ఆయనకు బాగా నచ్చిందని డైమండ్ రత్నబాబు పేర్కొన్నాడు. తప్పకుండా చిరంజీవి నుంచి త్వరలోనే పిలుపు వస్తోందనే నమ్మకంతో ఉన్నానని తెలిపాడు.
షేర్ సినిమాతో రచయితగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు డైమండ్ రత్నబాబు. లక్కున్నోడు, గాయత్రి సినిమాలకు రైటర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఆది సాయికుమార్ బుర్రకథతో పాటు మోహన్బాబు సన్నాఫ్ ఇండియా సినిమాలకు దర్శకత్వం వహించాడు.
సన్నాఫ్ ఇండియా సినిమా గత ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. కాగా డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం అన్స్టాపబుల్లో బిగ్బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటిస్తోన్నాడు.