తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh: ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తా - వెంక‌టేష్ కామెంట్స్‌

Venkatesh: ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తా - వెంక‌టేష్ కామెంట్స్‌

12 December 2023, 10:02 IST

  • Venkatesh: మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌పై వెంక‌టేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. మంచి క‌థ కుదిరితే ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల‌తో సినిమాలు చేస్తాన‌ని అన్నాడు.

 వెంక‌టేష్
వెంక‌టేష్

వెంక‌టేష్

Venkatesh: అల్లు అర్జున్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌ల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని అన్నాడు హీరో వెంక‌టేష్‌. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న సైంధ‌వ్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. సైంధ‌వ్‌ ప్ర‌మోష‌న్స్‌తో వెంక‌టేష్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలోని స‌ర‌దా స‌ర‌దాగా అనే పాట‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Srikanth Box Office Collections: దుమ్మురేపుతున్న శ్రీకాంత్ మూవీ.. మన పారిశ్రామికవేత్త బయోపిక్ బాలీవుడ్‌లో సూపర్ హిట్

Godzilla x Kong The New Empire OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ

Jai Ganesh OTT: ఓటీటీలోకి భాగ‌మ‌తి హీరో మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్‌

Game Changer Release Date:రామ్ కోసం భీమ్ త్యాగం...దేవ‌ర డేట్‌కు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న గేమ్‌ఛేంజ‌ర్‌

ఈ వేడుక‌లో వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల గురించి మాట్లాడుతూ టాలీవుడ్‌లోని హీరోలంద‌రితో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయాల‌ని ఉంద‌ని తెలిపాడు. మంచి క‌థ కుదిరితే ప్ర‌భాస్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల‌తో సినిమాలు చేయ‌డానికి తాను రెడీ అని తెలిపాడు. ప‌వ‌న్‌, రానా, వ‌రుణ్‌తేజ్ మాత్ర‌మే కాదు ఇండ‌స్ట్రీలోని హీరోలంద‌రితో క‌లిసి న‌టించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పాడు.

ఒక‌ప్ప‌టిలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్‌ను ఆద‌రించే ప్రేక్ష‌కులు త‌గ్గిపోయార‌ని, ఇప్పుడున్న ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొనే యాక్ష‌న్ మూవీస్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

రానా నాయుడు 2 బోల్డ్ కానీ...

రానా నాయుడు వెబ్‌సిరీస్‌పై కూడా సైంధ‌వ్‌లో వెంక‌టేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. రానా నాయుడు సీజ‌న్ 2లో కూడా త‌న క్యారెక్ట‌ర్ బోల్డ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలిపాడు. ఫ‌స్ట్ పార్ట్‌కు భిన్నంగా బోల్డ్ కంటెంట్ కంటే యాక్ష‌న్‌, కామెడీగా ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉండ‌బోతున్న‌ట్లు వెంక‌టేష్ చెప్పాడు. కొంత‌మందికి న‌చ్చిన అంశాల‌ను ఈ సినిమా నుంచి తొల‌గించిన‌ట్లు బోల్డ్ కంటెంట్‌పై ఫ‌న్నీగా కామెంట్స్ చేశాడు.

సైంధ‌వ్‌తో పాన్ ఇండియా ఎంట్రీ...

సైంధ‌వ్ మూవీతో వెంక‌టేష్ పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణి శ‌ర్మ, ఆండ్రియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. సైంధ‌వ్ సినిమాను తొలుత డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ స‌లార్ బ‌రిలోకి రావ‌డంతో సంక్రాంతికి వాయిదాప‌డింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం