తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trailer | దావూద్‌ను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారుల అన్వేషణ.. మరి దొరికాడా?

Trailer | దావూద్‌ను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారుల అన్వేషణ.. మరి దొరికాడా?

HT Telugu Desk HT Telugu

15 March 2022, 18:51 IST

    • తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం మిషిన్ ఇంపాజిబుల్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మహేశ్ బాబు విడుదల చేశారు. కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ లాంచ్ చేసిన మహేశ్
మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ లాంచ్ చేసిన మహేశ్ (Twitter)

మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ లాంచ్ చేసిన మహేశ్

దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు తిరుగుతున్నారు. ముగ్గురు చిన్నారులు. అంతేకాదండోయ్ అతడిని పట్టుకునేందుకు ఇళ్లను సైతం వదిలేశారు. ఇంతకీ నిజ జీవితంలోనే కాదులేండి. మిషిన్ ఇంపాజిబుల్ అనే సినిమాలో. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో నేరుగా నటిస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. వినోదాత్మకంగా సాగిన ఈ ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

NNS Serial May 16th Episode: మిస్స‌మ్మ‌ను అవ‌మానించిన మ‌నోహ‌రి - త‌ల్లికి ఎదురుతిరిగిన అమ‌ర్ - నిజ‌మైన అరుంధ‌తి మాట‌

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

‘దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారట.. ఆ డబ్బులతో రాజమౌళి బాహుబలి పార్ట్-3 తీస్తారు' అనే డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి. కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘అతడి దగ్గరకు వెళ్లిన చిన్నారులను మీ పేరేంటి అని రిషబ్ శెట్టి అడుగ్గా.. రఘుపతి.. రాఘవ.. రాజారామ్, ఆర్ఆర్ఆర్ అని బదులిస్తారు. ఆ చిన్నారులే తిరిగి మీ పేర్లేంటి అని రిషబ్ శెట్టిని అడగటంతో ఖలీల్.. జిలానీ.. ఫారుక్ కేజీఎఫ్ అని చెప్పడంతో వన్నా, టూ.. ఆ' అంటూ పిల్లలు కౌంటర్ వేయడంతో ట్రైలర్ ముగుస్తుంది.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన స్వరూప్.. తన రెండో సినిమాగా మిషన్ ఇంపాజిబుల్‌ను తెరకెక్కించారు. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్‌ను చూస్తే ఆకట్టుకునేలా ఉంది.

ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని మ్యాటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు సంగీతం మార్క్ కే రాబిన్ అందించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం