తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dongalunnaru Jagratha Ott Release Date: రెండు వారాల్లోనే ఓటీటీలోకి కీర‌వాణి త‌న‌యుడి సినిమా

Dongalunnaru Jagratha OTT Release Date: రెండు వారాల్లోనే ఓటీటీలోకి కీర‌వాణి త‌న‌యుడి సినిమా

06 October 2022, 6:01 IST

  • sri simha koduri dongalunnaru jagratha: కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహ‌ హీరోగా న‌టించిన దొంగ‌లున్నారు జాగ్ర‌త్త సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే..
శ్రీసింహ‌
శ్రీసింహ‌ (Twitter)

శ్రీసింహ‌

Dongalunnaru Jagratha OTT Release Date: సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహ‌ హీరోగా న‌టించిన దొంగ‌లున్నారు జాగ్ర‌త్త సినిమా ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్‍ను మిస్ అవ్వొద్దు!

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

NNS Serial May 16th Episode: మిస్సమ్మకు అమర్ ముద్దు - అరుంధ‌తిని చంపిన‌ మ‌నోహ‌రి - స‌ర‌స్వతిని కాపాడిన రామ్మూర్తి

పార్క్ చేసి ఉన్న కారులోని ఖ‌రీదైన వ‌స్తువుల్నిదొంగ‌త‌నం చేయాల‌ని ప్లాన్ చేసిన ఓ దొంగ క‌థ‌తో ఈ సినిమా రూపొందింది . అనుకోని ప‌రిస్థితుల్లో ఆ కారులోనే దొంగ చిక్కుకుపోతాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎదురైన ప‌రిణామాల‌తో ద‌ర్శ‌కుడు స‌తీష్ త్రిపుర....దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌ సినిమాను తెర‌కెక్కించాడు.

ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిల్మ్స్ సంస్థ‌లు నిర్మించాయి. థియేట‌ర్ల‌లో విడుద‌లైన రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ నెల 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.

దొంగ‌లున్నారు జాగ్ర‌త్త సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని(Samuthirakani), ప్రీతి అస్రాణి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఓటీటీ కోస‌మే ఈ సినిమాను రూపొందించిన‌ట్లు స‌మాచారం. కాన్సెప్ట్ బాగున్నా ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

మ‌త్త‌వ‌ద‌ల‌రా సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు శ్రీసింహ‌. దొంగ‌లున్నారు జాగ్ర‌త్త హీరోగా అత‌డి మూడో సినిమా

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం