samantha: నాలోని గ్లామర్ యాంగిల్ను మాత్రమే చూశారు...సౌత్ డైరెక్టర్స్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
22 July 2022, 7:11 IST
కాఫీవిత్ కరణ్షోలో దక్షిణాది దర్శకులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ డైరెక్టర్స్ తనలోని గ్లామర్ యాంగిల్ను మాత్రమే చూశారంటూ పేర్కొన్నది. సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి.
సమంత
ఫ్యామిలీమ్యాన్ -2 సిరీస్తో బాలీవుడ్లో సమంత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది. నటిగా సమంతలోని కొత్త కోణాన్ని ఈ సిరీస్ ఆవిష్కరించింది. ఇందులో తమిళ రెబెల్ రాజీగా నెగెటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో చక్కటి విలనిజాన్ని పండించి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్చేసింది. గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా అవసరమైతే విలన్ పాత్రలను కూడా సమంత చేయగలదని ఈ సిరీస్ నిరూపించింది. ఈ సిరీస్ తర్వాత బాలీవుడ్లో సమంత బిజీగా మారిపోయింది. పలు సిరీస్లు, సినిమాల్లో అవకాశాల్ని అందుకుంటోంది. ఫ్యామిలీమ్యాన్-2 వెబ్సిరీస్లో రాజీ క్యారెక్టర్ను అంగీకరించడానికి గల కారణాల్ని కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించింది సమంత.
ఈ సందర్భంగా దక్షిణాది ఇండస్ట్రీపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది దర్శకులు తనను బబ్లీక్యూట్ గర్ల్ కోణంలోనే చూశారని సమంత అన్నది. గ్లామరస్ క్యారెక్టర్స్, హీరో లవ్ ఇంట్రెస్ట్ రోల్స్ లోనే చూపించడానికి ప్రాధాన్యమిచ్చారని తెలిసింది. సౌత్లో ఎక్కువగా మూసధోరణితో కూడిన అలాంటి పాత్రలే తనను వరించాయని తెలిపింది. ఇలాంటి రెగ్యులర్ క్యారెక్టర్స్కు భిన్నంగా నటన పరంగా ఛాలెంజ్గా నిలిచే రోల్స్ కోసం చాలారోజులుఎదురుచూశానని సమంత అన్నది. అలాంటి బలమైన క్యారెక్టర్ను పోషించే అవకాశం ఫ్యామిలీమ్యాన్-2లో లభించిందని, అందుకే రాజీ క్యారెక్టర్ను అంగీకరించానని చెప్పింది.
గత ఏడాది విడుదలైన ఈ సిరీస్లో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు దక్కాయి.ఈ సిరీస్కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఈ దర్శకద్వయంతోనే బాలీవుడ్లో మరో వెబ్సిరీస్ చేస్తోంది సమంత.
టాపిక్