Sai Pallavi - Pooja Hegde: సాయిపల్లవి, రాశీఖన్నా, పూజా హెగ్డే... ఫ్యాన్స్ను ఇలా డిసపాయింట్ చేశారేంటి?
29 November 2023, 5:52 IST
Sai Pallavi - Pooja Hegde: 2023లో కొందరు అగ్ర హీరోయిన్లు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు. వారు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు.ఆ హీరోయిన్లు ఎవరంటే?
సాయిపల్లవి. పూజా హెగ్డే
Sai Pallavi - Pooja Hegde: 2023 ఏడాది ముగియడానికి ఇంకో నెల రోజులు మాత్రమే ఉంది. ఈ ఇయర్ టాలీవుడ్కు ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. నెలకు రెండు మూడు సక్సెస్లతో బాక్సాఫీస్ కలకలలాడింది. ముఖ్యంగా 2023 హీరోయిన్లకు లక్కీ ఇయర్గా నిలిచింది.
అగ్ర నాయికలతో పాటు కొత్త హీరోయిన్లు సిల్వర్ స్క్రీన్పై మెరిపించి మురిపించారు. కొందరు కథానాయికలు తమ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించగా మరికొందరు మాత్రం షూటింగ్లతోనే ఈ ఏడాది మొత్తం గడిపేశారు. మరి కొందరు ఈ ఏడాది మొత్తం టాలీవుడ్ కు బ్రేక్ తీసుకున్నారు. 2023లో తెలుగు తెరపై కనిపించని కొందరు హీరోయిన్లు ఎవరంటే?
సాయిపల్లవి
ఈ ఏడాది సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు దర్శనమివ్వలేదు. గత ఏడాది విరాటపర్వం సినిమా చేసిన సాయిపల్లవి ఈ ఇయర్ మొత్తం టాలీవుడ్కు బ్రేక్ ఇచ్చేసింది. ఆది నుంచి కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్న సాయిపల్లవి విరాటపర్వం తర్వాత తెలుగులో ఏ సినిమాపై సంతకం చేయలేదు.
ఇటీవలే నాగచైతన్యతో తండేల్ సినిమాను అంగీకరించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే తండేల్ రిలీజ్ కానుంది. అంటే సాయిపల్లవి టాలీవుడ్ స్క్రీన్ఫై కనిపించాలంటే మరో ఏడెనిమిది నెలలపైనే సమయం పట్టేలా ఉంది.
పూజా హెగ్డే...
గత నాలుగైదేళ్లుగా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన పూజా హెగ్డే 2023లో టాలీవుడ్ సిల్వర్స్క్రీన్పై కనిపించలేదు. గత ఏడాది ఆమె నటించిన ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్స్గా నిలవడంతో ఆ ఎఫెక్ట్ పూజా హెగ్డే కెరీర్పై పడింది.
మహేష్బాబు గుంటూరు కారం నుంచి అనివార్య కారణాల వల్ల వైదొలిగిన పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఏడాది బాలీవుడ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మినహా పూజాహెగ్డే నటించిన దక్షిణాది సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. ఈ ఏకైన బాలీవుడ్ మూవీ కూడా డిజాస్టర్గా నిలిచి పూజా హెగ్డేకు నిరాశనే మిగిల్చింది.
అనుపమ పరమేశ్వరన్...
2023లో అనుపమ పరమేశ్వరన్ ను టాలీవుడ్ ప్రేక్షకులు మిస్సయ్యారు. ఆమె సినిమాలు ఏవి ఈ ఏడాది రిలీజ్ కాలేదు. అయినా అనుపమ మాత్రం ఖాళీగా లేదు. . ప్రస్తుతం తెలుగులో టిల్లు స్వ్కేర్తో పాటు రవితేజ ఈగిల్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్.
ఈగిల్ సంక్రాంతికి రిలీజ్ అవుతోండగా టిల్లు స్వ్కేర్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే ఏడాది నెల రోజుల గ్యాప్లోనే అనుపమ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలా ఈ ఏడాది గ్యాప్ను 2024 ఆరంభంలోనే ఫుల్ఫిల్ చేయబోతున్నది అనుపమ.
రాశీఖన్నా కూడా 2023లో తెలుగు ప్రేక్షకులకు హ్యాండిచ్చింది. థాంక్యూ తర్వాత టాలీవుడ్కు దూరంగా ఉంటోన్న రాశీఖన్నా బాలీవుడ్తో పాటు కోలీవుడ్పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.